టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గందపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఫస్ట్ పార్ట్కు మించి సెకెండ్ పార్ట్ను ప్లాన్ చేశాడట సుకుమార్.
ఫస్ట్ పార్ట్లో గందపు చెక్కల స్మగ్లర్గా కనిపించే బన్నీ.. సీక్వెల్లో గందపు చెక్కల మాఫియాను శాసించే డాన్గా కనిపిస్తారట. ఫస్ట్ పార్ట్లో మాస్ యాక్షన్ చూపించే బన్నీ.. సెకండ్ పార్ట్లో స్టైలిష్ విలనిజం చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో