నాగ్ చేసిన త‌ప్పు చేయ‌నంటున్న వెంకీ..?!

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్య‌గా సీనియ‌ర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని వెంకీ మ‌రియు చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఓ ఓటీటీ సంస్థ ఈ సినిమా కోసం రూ. 30 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల విడుద‌లైన నాగార్జున్ `వైల్డ్ డాగ్‌` చిత్రాన్ని మొద‌ట ఓటీటీలో విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ, చివ‌ర్లో ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసి.. థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని రూ. 9 కోట్లకు అమ్మితే.. కేవ‌లం రూ. 3.50 కోట్లు రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. అదే ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే.. రూ. 22 కోట్ల అన్న దక్కేవి. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకున్న వెంకీ నాగ్ చేసిన త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇక మ‌రోవైపు క‌రోనా రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో.. ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్‌కి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అందుకే దృశ్యం 2ను లేట్ చేయ‌కుండా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.