క‌రోనా వ‌ల్లే అందం పెరిగింది..ర‌ష్మిక షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న‌ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసి బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే ర‌ష్మిక.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొంది.

ఈ లైవ్‌లో నెటిజ‌న్లు అనేక ప్ర‌శ్న‌లు వేయ‌గా.. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ఇంత అందంగా ఎలా ఉన్నార‌ని ప్ర‌శ్నించాడు. అందుకు ర‌ష్మిక‌.. కరోనా వల్ల బయటకు వెళ్లడం తగ్గింది.

బయటకు వెళ్లక పోవడం వల్ల మేకప్ కూడా వేసుకోవడం లేదు. మేకప్ వేసుకోక పోవడం వల్ల ఆటోమేటిక్ గా ఫేస్ గ్లో అనేది పెరిగి అందం పెరుగుతుందని చెప్పుకొచ్చింది. మెత్తానికి క‌రోనా వ‌ల్ల గ్లామ‌ర్ పెరిగింద‌ని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది ర‌ష్మిక‌.