మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ `సిద్ధా` అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. చరణ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
ఇటీవలె పూజా హెగ్డే కూడా ఆచార్య షూటింగ్లో పాల్గొంది. అయితే ఈ చిత్రంలో పూజా రోల్ చాలా చిన్నదట. ఆమెది కేవలం ఇరవై నిమిషాల పాత్ర అని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో పూజా రోల్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, ఫుల్ ఎమోషనల్గా ఉండే ఆమె పాత్ర చనిపోతుందని కూడా ప్రచరాం జరుగోతంది.
ఇక మరో విషయం ఏంటంటే.. చిన్న రోల్ అయినప్పటికీ.. ఈ సినిమాకు పూజా భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది. ఈ సినిమాకు ఏకంగా రూ. కోటి రూపాయిలు పూజా తీసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.