క‌రోనా బారిన ప‌డ్డ `వ‌కీల్ సాబ్‌` హీరోయిన్‌..షాక్‌లో చిత్ర‌యూనిట్‌!

క‌రోనా వైర‌స్.. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న సమ‌స్య ఇది. ఆ మ‌ధ్య క‌రోనా తీవ్ర‌త త‌గ్గినా.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్‌కు క‌రోనా సోకింది. ఈ విషయం స్వ‌యంగా నివేదానే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. నాపై ప్రేమ కురిపిస్తున్న, సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను.

అంద‌రూ మాస్క్ ధరించండి. క్షేమంగా ఉండండి` అని నివేదా ట్వీట్ చేసింది. కాగా, ప్ర‌స్తుతం నివేదా ప‌వ‌న్ రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌`లో కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇలాంటి త‌రుణంలో నివేదాకు క‌రోనా సోక‌డంతో.. చిత్ర యూనిట్‌కు షాక్ త‌గిలిన‌ట్టు అయింద‌ట‌.

Nivetha Thomas explains her birthday mood in new monochrome pics | Telugu Movie News - Times of India