మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా..ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, కరోనా దెబ్బకు షూటింగ్కు బ్రేక్ పడడంతో.. విడుదలను వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి బర్త్డే(ఆగస్టు 22వ) నాడు ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ లోగా బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ను పూర్తి చేసేసి.. ప్రమోషన్స్ షురూ చేయాలని ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నారు. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్.