ఏపీపై మోడీకి ఎంత అక్క‌సు ఉందంటే… ప‌చ్చి నిజాలు ఇవే…!

అప్పుల‌పై కుప్పిగంతులు.. జ‌నం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోష‌ల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. క‌నిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయ‌ని.. రుణ ప‌రిమితులు కూడా దాటిపోయాయ‌ని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధ‌తిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల ప‌రిస్థితి కూడా మ‌రో శ్రీలంక‌లా మారుతుంద‌ని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.   ఈ ప్ర‌క‌ట‌న‌, […]

సేమ్ టు సేమ్‌.. ప‌వ‌న్ అదే పొలిటిక‌ల్‌ పాఠం..!

సేమ్ టు సేమ్‌.. డైలాగులు మాత్ర‌మే మారాయి. విష‌యం మాత్రం అదే! అదే.. ప‌వ‌న్ ప్రసంగం. ఆయ‌న తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే.. ఎక్క‌డో ఎవ‌రో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్య‌లే గుర్తుకు వ‌చ్చేలా ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అధికారం ఇవ్వాల‌ని.. ప‌వ‌న్ కొన్నాళ్లుగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీపై తీవ్ర […]

ఎస్టీ సీట్లు మళ్ళీ ‘ఫ్యాన్’ పరమే!

ఏపీలో రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా బలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు వైసీపీకి ఎప్పుడు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు…2014 ఎన్నికలు కావొచ్చు…2019 ఎన్నికలు కావొచ్చు…రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎస్టీ స్థానాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటింది. రాష్ట్రంలో పోలవరం, అరకు, పాడేరు, రంపచోడవరం, […]

అడ్డంగా బుక్ అయిపోయిన ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే…!

ఒక నాయ‌కుడు ఎంత వ‌ర‌కు ఉండాలో .. అంత వ‌ర‌కు ఉంటే .. ఎలాంటి స‌మ‌స్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే స‌మ‌స్య‌. అంతా తానే అయిన‌ట్టు.. అధిష్టానం ద‌గ్గ‌ర త‌న‌కు ప‌లుకుబడి ఉన్న‌ట్టు.. నాయ‌కులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా ప‌రిస్థితి మారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఆయ‌న పేరు ఎత్తితేనే మండిప‌డుతున్నారు. […]

పేప‌ర్ క‌టింగులు పెరుగుతున్నాయ్‌.. వైసీపీలో సెన్షేష‌న‌ల్ న్యూస్‌…!

రాజ‌కీయాల్లో నేత‌లు ఎవ‌రికి భ‌య‌ప‌డినా.. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌క‌పోయినా.. ఇప్ప‌టికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీనికి కార‌ణం .. సాధార‌ణ చానెళ్లు అయితే.. వార్త‌ల‌ను మార్చుకునేందుకు… వెంట‌నే స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుద‌ర‌దు. ఒక‌వేళ స‌వ‌ర‌ణ‌లు వేసినా.. అప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి ప్ర‌చారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయ‌కులు అంతో ఇంతో మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీ […]

2024 ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ జ‌న‌సేన‌లో కొత్త‌ గుబులు..!

రాష్ట్రంలో ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎలాం టి సీన్ క‌నిపిస్తోందో.. ఇప్పుడు కూడా అదే సీన్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. అప్ప‌ట్లో ప‌వ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌ల‌కు యువ‌త జిల్లాలు .. దాటుకుని మ‌రీ.. వెళ్లి జ‌న‌సేనానినికి జై కొట్టారు. అంతేకాదు.. కాబోయే సీఎం .. […]

వైసీపీలో వారసులు ఎంట్రీ..లక్ ఎవరికి?

మెరుగైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వను…ఇది తాజాగా వైసీపీ వర్క్ షాప్ లో సీఎం జగన్ చేసిన కామెంట్. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలని ప్రజల్లోకి పంపించిన విషయం తెలిసిందే. తాను ప్రజలకు అనేక పథకాలు అందించానని, వాటిని ప్రజలకు సవివరంగా వివరించి…ప్రజల మద్ధతు ఇంకా పెంచుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్…ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడప గడపకు కార్యక్రమంలో […]

అంతుప‌ట్ట‌ని ప‌వ‌న్ రాజ‌కీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీడు పెంచారు. వ‌రుస‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను ప‌రామ‌ర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త మూడేళ్ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు ప‌వ‌న్ దూకుడు పెంచ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు. దీనికి కార‌ణం.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డ‌మేనా? లేక మ‌రేదైనా వ్యూహం ఉందా? అనేది చ‌ర్చ‌గా […]

వైసీపీలో 70 మందికి సెగ‌… జ‌గ‌న్ మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో స‌గం మంది ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. ప్ర‌స్తుతం ఈ చ‌ర్చ తాడేప‌ల్లి వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అనేక విమ‌ర్శ‌లువ‌స్తు న్నాయి. మొద‌ట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవ‌లం ప్ర‌తిప‌క్షాల కుట్ర అని […]