కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల అనేక నష్టాలు వాటిల్లాయి. తాజాగా ఐపీఎల్ కూడా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా ఇండియా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ పంత్కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన 23 మంది సభ్యులలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిసింది. […]
Tag: tests
అన్ని మెడికల్ టెస్ట్ లు ఉచితం : సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో […]
రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్..ఇందులో నిజమెంతంటే..?
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు అన్ని ఖర్చుతో కూడుకున్నవే. ఇంకా రిజల్ట్ వచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఈ లోపు కొంత మందికి అయినా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనిపెట్టారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను […]
యోగి ఆదిత్యనాథ్కు కరోనా..?
దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా బాగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే ఆయన కరోనా టెస్ట్స్ చేయించుకోగా, కరోనా పరీక్షలో ఆయనకి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు స్వయంగా తెలిపారు. వైరస్ లక్షణాలు తనలో కనిపించడంతో తాను కోవిద్ పరీక్షలు చేయించుకున్నానని, దాని రిపోర్ట్ పాజిటివ్గా వచ్చినట్లు ఆదిత్యనాథ్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. […]
కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా […]
కరోనా భారిన పడిన తమిళ హీరోయిన్ …!?
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని, మిగత వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టా ద్వారా గౌరీ వెల్లడించింది. తనను ఇటీవల కలిసిన అందరు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని గౌరీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉందని, తన ఆరోగ్యబాగానే ఉందని, ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. గౌరీ కిషన్ ఇటీవలే తమిళ నాట ప్రముఖ హీరో విజయ్ […]