కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్‌ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్‌ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్‌ ఆకర్ష స్టార్ట్‌ అయ్యిందంటే, […]

జాక్ పాట్ కొట్టనున్న వివేక్..

రాజు తలచు కుంటే దెబ్బలకి కరువా అన్నట్టుంది తెలంగాణా రాజకీయ సిత్రం.కెసిఆర్ కరుణ వుంటే చాలు రాత్రికి రాత్రి ఏ జాక్ పాట్ అయినా తగలోచ్చు.ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిపోయి.. ఎన్నికలను ఆ పార్టీ నుంచే ఎదుర్కొని తిరిగి ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి వచ్చి చేరిన కాకా తనయుడు వివేక్ కు ఇప్పుడు జాక్ పాట్ తగలనుందని టిఆర్ ఎస్ లో టాక్. ప్రస్తుతానికి మాజీ […]

జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!

జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ […]

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జువ్వాడ నర్సింగరావులను సీఎం తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటూ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి […]

కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]

కెసియార్‌ వెన్నులో వణుకు పుట్టింది

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసియార్‌) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్‌ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కెసియార్‌ని ఒకటి భయపెట్టింది. అలా ఇలా కాదు, వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. అదే పోలియో వైరస్‌. హైద్రాబాద్‌లోని ఓ మురికి కాలువ నీటి శాంపిల్స్‌ని పరీక్షిస్తే అందులో పోలియో వైరస్‌ వెలుగు చూడటంతో కెసియార్‌ షాక్‌కి గురయ్యారు. దేశం నుంచి పోలియో […]

తెలంగాణా లో మిగిలింది ఒకే ఒక్కడు!!

తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ […]

బావ.. బామ్మర్ది..ఓ తెలంగాణా..

ఆ మధ్యన AP CM చంద్రబాబు నాయుడు గారు అసలు తెలంగాణా ప్రజానీకానికి పొద్దున్నే లేవడం NTR గారే నేర్పించారని మాట జారి తరువాత నాలుక కరుచుకోవడం ఆయన వంతైంది.అక్కడికేదో తెలంగాణా వాళ్ళు బద్దకస్తులని వారికి రామారావు గారే పొద్దున్న లేవటం నేర్పారన్నట్టు సెలవివ్వడంతో క్షమాపణ చెప్పే వరకు వెళ్ళింది వ్యవహారం.ఈయనకి ఈ తరహా చలోక్తులు ఈ మధ్యన బాగానే రివర్స్ అవుతున్నాయి.కోడలు మగబిడ్డని కంటా అంటే అత్త వద్దంటుందా అని,వెనుకబడిన కులాల్లో పుట్టాలని ఎవరినా కోరుకుంటారా […]

కోదండరాం ని కెలకొద్దు – కెసిఆర్

తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం […]