కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]
Tag: Municipal elections
వైఎస్.వివేకా ఓటమికి చంద్రబాబు షాకింగ్ స్కెచ్
అవును! వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల అభ్యర్థిగా వైకాపా తరఫున జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు స్థానికంగా మంచి పేరుంది. దీంతో ఈయనను ఎదుర్కోవాలంటే ఇంతే స్థాయి నేత అవసరం. జగన్ ఇలాకా కడపలో టీడీపీ పాగా వేసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 జగన్ను తన సొంత జిల్లాలోనే మట్టి […]
ఆ ఎన్నికల్లో పెద్ద నోట్ల ఎఫెక్ట్ తప్పదా ?
ఎన్నికలన్నాక నోట్లతోనే పని!! అంతలా మారిపోయాయి దేశంలో ఎన్నికలు. నిజానికి చెప్పాలంటే.. మారిపోలేదు మన నేతలే అలా మార్చేశారని చెప్పకతప్పదు! ఏ ఎన్నికలు వచ్చినా నోట్లు కొట్టందే ఓట్టు రాలని పరిస్థితి. అవి ఢిల్లీస్థాయి ఎన్నికలైనా, గల్లీ స్థాయి ఎన్నికలైనా.. పోరులో గెలవాలంటే.. నోట్లు కుమ్మరించాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. త్వరలోనే రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 11 మునిసిపల్ స్థానాలకు, 5 కార్పొరేషన్లకు ఎన్నికలు ఖాయమని తెలిసిపోయింది. ప్రభుత్వం ఓటర్ల జాబితా పంపగానే ఎన్నికల సంఘం […]
ఏపీలో మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ
ఏపీలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ జరుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేషన్లకు ఎట్టి పరిస్థితిలోనూ రానున్న రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి నవంబరు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని తమకు చెప్పాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం, […]
ఏపీ మునిసిపల్ ఎన్నికల పై TJ విశ్లేషణ
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేదని, మరింత బలం పెంచుకున్నామని చాటుకోవాలని.. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.. అదే సమయంలో ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవడం ద్వారా అధికార పార్టీకి కళ్లెం వేయాలని, 2019 […]