ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివ‌రాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవ‌ల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]

అల‌ర్డ్ అంటున్న‌ `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచ‌న‌లో ప‌డ్డ ఫ్యాన్స్‌!‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)‌`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేయ‌గా.. చిత్ర యూనిట్ […]

నిధి అగ‌ర్వాల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ద‌గ్గుబాటి హీరోతో..?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్‌లో జయం రవి, శింబు సినిమాలలో న‌టించి.. మ‌రింత హైప్ క్రియేట్ చేసుకుంది నిధి. దీంతో ప్ర‌స్తుతం అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా పవర్ […]

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న నాని `వి`!

న్యాచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెర‌కెక్కించిన చిత్రం `వి`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అది కూడా అమోజాన్ ప్రైమ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్టైన చిత్రాల‌ను […]

భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం..70 వేల‌కు పైగా కొత్త కేసులు!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 72,330 మందికి కొత్తగా కరోనా […]

రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు..ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. ఈయ‌న‌కు అన్ని భాష‌ల్లోనూ అభిమానుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని ఎంద‌రికో ఆద‌ర్శం. అటువంటి ర‌జ‌నీకి తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్ర‌క‌టించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్ల‌డిస్తూ.. `భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో […]

తెలంగాణ‌లో భ‌య‌పెడుతున్న క‌రోనా..భారీగా కొత్త కేసులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ […]

అదిరిన‌‌ `వై’ ట్రైల‌ర్..మ‌రో థ్రిల్లింగ్ మూవీతో వ‌స్తున్న `ఆహా`!‌

గ‌త కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్ష‌కులను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మ‌రో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీల‌క పాత్ర‌లో బాలు అడుసుమిల్లి తెర‌కెక్కించిన చిత్రమే `వై`. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమా […]

`వ‌కీల్ సాబ్‌` యూనిట్‌పై శ్రుతిహాస‌న్ ఫ్యాన్స్ గుర్రు..ఎందుకంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ […]