సీనియర్ రాజకీయ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకేనా.. ఆయన కొడుకు కరణం వెంకటేష్ పొలిటికల్ కెరీర్కు కూడా శుభం కార్డు పడబోతోందా ? ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది. చంద్రబాబులా 40 ఏళ్ల హిస్టరీ అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తోన్న బలరాంకు వారసుడు వెంకటేష్ విషయంలో ఎంతో ఆవేదన ఉంది. ఇది ఆయన ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అద్దంకిలో బలరాం, […]
Tag: Karanam Balaram
వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు…!
ఓ వైపు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు జగన్. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రివ్యూ సమావేశంలో నేతలకు పలు సూచనలు కూడా చేశారు. 9 నెలలు కష్టపడితే… పార్టీకి, మీకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని నియోజకవర్గాలు పార్టీని ఇబ్బంది […]
ఆసక్తికరంగా చీరాల రాజకీయం….!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం చీరాల. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నియోజకవర్గం ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనేది ఇప్పటికీ అంతు చిక్కని మాట. అక్కడ అన్ని సామాజికవర్గాలది కీలక పాత్ర. యాదవ, ఆర్యవైశ్య, కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలు గెలుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ విజయం సాధించలేదు. దీంతో ఈ సారి గెలుపు కోసం వైసీపీ, టీడీపీలు […]
చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?
మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. […]
‘మరణ దిన వేడుకలు’ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి మర్మం ఏమిటి ? టార్గెట్ బలరాం గా ఆపరేషన్?
బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది. కొద్దిగా వెనక్కు వెళితే..! 2019లో చీరాల నుండి […]
కరణం వారసుడి కష్టాలు..బాబు-లోకేష్ టార్గెట్.!
ఎన్నో ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కరణం బలరామ్ గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచాక..వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. తన కుమారుడు కరణం వెంకటేష్తో పాటు బలరామ్ వైసీపీలోకి వెళ్లారు. ఇక వైసీపీలోకి వెళ్ళాక కరణం..ఎప్పుడు కూడా చంద్రబాబుని విమర్శించిన సందర్భం లేదు. ఇటు ఏమో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లాంటి వారైతే బాబు, లోకేష్లని గట్టిగానే తిట్టారు. కానీ కరణం మాత్రం అలాంటి కార్యక్రమాలు చేయలేదు. తన పని తాను […]
పోలిటికల్ రిస్క్లో వంశీ-కరణం..!
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబుని తిట్టి…మరొకరు చంద్రబాబుని తిట్టక రాజకీయంగా రిస్క్లో పడ్డారని తెలుస్తోంది. అలా రిస్క్లో పడిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో ఈపాటికి అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అనేక ఏళ్ళు టీడీపీలో పనిచేసి..2019 ఎన్నికల తర్వాత వైసీపీ వైపుకు వచ్చిన కమ్మ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం అని చెప్పొచ్చు. వీరిలో ఎవరో తిట్టి రిస్క్లో పడ్డారో తెలిసిందే. వైసీపీ వైపుకు వచ్చాక వంశీ..ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ […]
రిస్క్లో కరణం వారసుడు..చీరాల డౌటే..!
ఏపీ రాజకీయాల్లో కరణం బలరాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు సమకాలికుడుగా పనిచేస్తూ వచ్చిన కరణం..అనూహ్యంగా బాబుకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచి..వైసీపీలోకి జంప్ కొట్టారు. సరే అధికార పార్టీలో ఉన్నారు..అంతా బాగానే ఉందని అనుకోవచ్చు. మిగతా విషయాల్లో బాగానే ఉందేమో గాని..రాజకీయంగా మాత్రం కరణంకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతానికి చీరాల ఎమ్మెల్యేగా కరణం ఉన్నారు…ఆయన వారసుడు చీరాల ఇంచార్జ్గా ఉన్నారు. మరి ఇంకేంటి నెక్స్ట్ చీరాల సీటు కరణం […]
వంశీకి తిరుగులేదు..ఆ ముగ్గురే డౌట్?
టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన ఎమ్మెల్యేలకు వైసీపీలో దాదాపు సీట్లు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు…వైసీపీలో పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్…టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. డైరక్ట్ వైసీపీలో జాయిన్ […]