ఏపీలో తాజా ప‌రిణామాలు రాజ‌కీయ వ్యూహాత్మ‌కమా ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూర‌లో ఓ క‌రివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. అస‌లు ప‌వ‌న్ రాజ‌కీయ ల‌క్ష్యం ఏంటి ? ప‌వ‌న్‌కు రాజ‌కీయాల్లో రాణించాల‌న్న క్లారిటీ ఉందా ? లేదా ? ప‌వ‌న్‌కు సినిమాలు ముఖ్య‌మా ? రాజ‌కీయాలు ముఖ్య‌మా ? అన్నదే ఇప్పుడు అంద‌రి మ‌దిలోను పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్‌గా మారుతోంది. ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా […]

ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న […]

బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]

ఆ మూడిట్లో ప‌ట్టుంటేనే 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ద‌క్కే ఛాన్సులు!

జ‌న‌సేన పెట్టి మూడేళ్ల‌వుతున్నా ఆ పార్టీకి ఇప్ప‌ట‌కీ సంస్థాగ‌తంగా స‌రైన నిర్మాణం లేదు. ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌కుండా టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ప‌వ‌న్ ఈ రెండు పార్టీల‌ను వ్య‌తిరేకించ‌డంతో పాటు 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంద‌ని చెప్ప‌డంతో పాటు తాను సైతం […]

ఇక్క‌డ ప‌వ‌న్‌.. అక్క‌డ ర‌జ‌నీ.. అజెండా ఒక్క‌టే!!

ప‌వ‌న్‌.. ర‌జ‌నీ.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీని స్థాపించ‌డంతోపాటు 2019లో ప్ర‌జాక్షేత్రంలో అడుగు పెడ‌తాన‌ని చెప్పాడు. అంతేకాదు, తాను, త‌న పార్టీ పుట్టింది ప్ర‌శ్నించ‌డానికేన‌ని వెల్ల‌డించాడు. ఇక‌, త‌మిళ‌నాట‌.. సూప‌ర్ స్టార్ ర‌జనీ కూడా పొలిటిక‌ల్ ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్ద‌రి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వ‌స్తున్నాయి. అలాగే వేల‌ల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి. నిజానికి వీరిద్ద‌రూ భాష‌ల […]

జ‌న‌సేనలో సామాన్యుల‌కు చోటు లేదా?!

ఏపీలో నూత‌న పార్టీ జ‌న‌సేన చుట్టూ ఇప్పుడు ఆస‌క్తికర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జ‌న‌సేన‌లో కీల‌క పోస్టుల నియామ‌కం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వ‌హించ‌డం బ‌హుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్‌లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను నియ‌మించిన సంద‌ర్భాలు లేవు. నిజానికి ఐఏఎస్ చ‌దివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌స‌త్తా స్థాపించిన జేపీ […]

ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్‌

2019 ఎన్నిక‌లు తెలంగాణ‌లో కంటే ఏపీలో ర‌స‌కందాయంగా ఉండేలా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత గ్యాప్ ఉన్నా మ‌రోసారి అధికార కూట‌మి అయిన టీడీపీ+బీజేపీ కూట‌మి క‌లిసి పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మోడీని క‌లిసిన నేప‌థ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు ఉన్నా అది మాట‌లో లేదా ప్ర‌క‌ట‌న‌ల‌కో మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వ్వ‌డం ఖాయం. ఇక కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన సైతం కూట‌మికి తెర‌లేపే సూచ‌న‌లు మెండుగా ఉన్న‌ట్టు […]

సినిమాల్లో అన్న‌య్య‌.. రాజ‌కీయాల్లో తమ్ముడు

టాలీవుడ్ టాప్ హీరోలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య ఎప్పుడూ ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండేది. ఇటీవ‌ల సంక్రాంతి బ‌రిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజ‌కీయాల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పోటీగా మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాల‌య్య బ‌రిలో ఉండ‌టం, ఆయ‌న‌పై ఇటీవ‌ల […]

రాధా.. జ‌గ‌న్‌ల బంధానికి బీట‌లు..

విజ‌య‌వాడ‌లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగ‌వీటి వంశ వార‌సుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌కి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి బెడిసి కొట్టింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయంగా వైసీపీకి కొంత‌కాలంగా త‌ట‌స్థంగా ఉంటూ వ‌స్తున్న రాధాని యువ నాయ‌క‌త్వం నుంచి జ‌గ‌న్ ఇటీవ‌ల త‌ప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జ‌గ‌న్ పార్టీకి గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి తండ్రి రంగా నుంచి వ‌చ్చిన వార‌స‌త్వంతో కాంగ్రెస్‌లో త‌న కంటూ గుర్తింపు పొందిన […]