జ‌న‌సేన‌లోకి నాగ‌బాబుకు ఎందుకు వెళ్ల‌లేదు

మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్స్ రూటే స‌ప‌రేటుగా ఉంటుంది. నిన్న‌టి వ‌ర‌కు నాగ‌బాబు అన్న చిరంజీవికి స‌పోర్ట్‌గా ఉండేవారు. చాలా ఫంక్ష‌న్ల‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డేవారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నాగ‌బాబు ప‌వ‌న్‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాగ‌బాబు త‌న తాజా ఇంట‌ర్వ్యూలో తాను జ‌న‌సేన‌లోకి ఎందుకు వెళ్ల‌లేదో చెప్పారు. తాను రాంచ‌ర‌ణ్‌తో తీసిన ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని.. పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇవ్వ‌డంతో తాను […]

జ‌న‌సేన‌లోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేత‌లు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేత‌లు ముందువ‌రుస‌లో ఉన్నారు. అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జా క్షేత్రంలో దిగుతాన‌ని, సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని.. ప‌వ‌న్ ప్ర‌కటించ‌డంతో అంద‌రిలోనూ ఉత్కంఠ మొద‌లైంది. అయితే ఇప్పుడు జ‌న‌సేన‌లో మాజీ ఎమ్మెల్యే చేర‌బోతున్నారనే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న‌కు జ‌నసేన టికెట్ కూడా ఖాయ‌మైంద‌ని అందుకే […]

నంద్యాల‌లో ప‌వ‌న్ ఎన్ని ఓట్ల‌ను ప్ర‌భావితం చేస్తాడు…!

`నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్ర‌క‌టిస్తా` అని జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒక‌టే చర్చ‌! ప‌వ‌న్ ఎన్ని ఓట్లు ప్ర‌భావితం చేస్తాడు? ఏఏ వ‌ర్గాల ఓట్ల‌ను త‌నవైపు తిప్పుకోగ‌లుగుతాడు? ఎవ‌రికి ఇది ప్ల‌స్? ఎవ‌రికి మైన‌స్‌? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప‌వ‌న్ నిర్ణ‌యంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా ఉత్కంఠ‌తో […]

ఏపీలో క‌మ్మ‌+కాపు క‌లిసే ప్లాన్‌

తెలుగు రాజ‌కీయాల‌కు కులాల‌కు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవ‌రు కాద‌న్నా ? ఎవ‌రు ఔన‌న్నా నిజం. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజ‌కీయాల ప్రాబ‌ల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు క‌మ్మ వ‌ర్సెస్ రెడ్ల మ‌ధ్య అధికారం కోసం వార్ జ‌రుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణ‌లో అధికారం కోసం ఇప్పుడు వెల‌మ వ‌ర్సెస్ రెడ్ల మ‌ధ్య పోరు జ‌రుగుతోంది. ఇక తెలంగాణ‌లో కంటే ఏపీలోనే […]

పవన్ కి మరీ ఇంత దారుణంగానా…!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయం ఎలా ఉంటుందో ? ఈ లోగా ఎలా రంగులు మారుతుందో ? ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ పోటీ చేస్తాన‌ని చెప్పినా ఆ పోటీ ఒంట‌రిగా ఉంటుందా ? లేదా ? ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాడా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో […]

జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువు!

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ స్టైలే వేరు. ఆయ‌న ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ఆయ‌న‌కు ఎదురు చెప్పేందుకే చాలామంది నాయ‌కులు భ‌య‌ప‌డేవారు. అలాంటిది హ‌ర్ష‌కుమార్ వైఎస్‌తో తీవ్రంగా విబేధించారు. 2009 ఎన్నిక‌ల్లో హ‌ర్ష‌కుమార్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు వైఎస్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేసినా హ‌ర్ష‌కుమార్ సోనియాగాంధీ ద‌గ్గ‌రే చ‌క్రం తిప్పుకుని సీటు ద‌క్కించుకున్నారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ రాజ‌కీయాల్లో యూత్ కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న […]

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ వెనుక అసలు కారణం?

చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ భేటీ అవుతున్నాడ‌నే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, ఇంత‌లోనే ఇది కేవ‌లం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేన‌ని తెలిసి అంద‌రూ నిరుత్సాహ‌ప‌డ్డారు. అయితే, నిజానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. బాబును క‌లుస్తోంది కేవ‌లం.. ఉద్దానం కోస‌మేనా? లేక ఇంకేమైనా విష‌యంపై చ‌ర్చించేందుకా? అనేది ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై తీవ్రంగా ఫైరైన జ‌న‌సేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా […]

జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]

ప‌వ‌న్ కూడా రెడీ..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు పాద‌యాత్ర‌లు బాగానే క‌లిసొస్తున్నాయి. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు సోద‌రి ష‌ర్మిల పాద‌యాత్ర చేసినా ఆమె పాద‌యాత్ర‌కు జ‌నాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత ప్లీన‌రీ సాక్షిగా తాను పాద‌యాత్ర‌కు రెడీ […]