ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార స్థానంలో కూర్చోబెట్టిన పొలిటికల్ అనలైజర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు. పలుసార్లు పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సమావేశమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు కొద్ది నెలలుగా వచ్చాయి. అయితే […]
Tag: congress
లీడర్స్ ఫ్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ ..కమలంలో మరో గ్రూప్..
తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]
రాజకీయాల్లోకి సోనూసూద్..ఆ పార్టీ నుండి పోటీ..క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!
సోనూసూద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నటుడుగానే కాకుండా సమాజసేవకుడిగా దేశప్రజలందరి మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయన. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్ అందించడం, కరోనా పేషెంట్లకు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎందరికో సాయపడి రియల్ హీరో అనిపించుకున్నాడీయన. అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా […]
భలే విచిత్రం.. ప్రతిపక్షనేతకు మంత్రి బహిరంగలేఖ
ఎక్కడైనా సరే అధికార పార్టీకి, మంత్రులకు ప్రతిపక్ష నేతలు లేఖలు రాయడం, విజ్ఞప్తులు చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం మంత్రినే ప్రతిపక్ష నేతకు బహిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ లేఖ రాసింది ఎవరంటే తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మరి ఎవరికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. […]
అక్కడ జోరు.. మరోచోట కనుమరుగు
కేరళలో సాంప్రదాయానికి విరుద్ధంగా వరుసగా రెండోసారి అధికారంలోకి రానుంది పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్. మొత్తం 140 స్థానాలకు గాను 90 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నది. ఎర్రజెండా రెపరెపలాడుతున్నది. కానీ పశ్చిమ బెంగాల్ లో వామపక్షాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్కడ పూర్తిగా కనుమరగయ్యే అవకాశం ఏర్పడింది. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా అందులో 292స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. అందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]
సాగర్లో విజయం దిశగా టీఆర్ ఎస్..!
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. విజయం దిశగా పయనిస్తున్నది. కారు దూకుడుకు విపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్లోనూ గులాబీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది, టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమైనట్లుగా తెలుస్తున్నది. వరుసగా తొలి ఎనిమిది రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఏడో రౌండ్ ముగిసే సరికి 6,592 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. ఎనిమిదో […]
కరోనా బారిన పడ్డ రాహుల్ గాంధీ!
మునుపటితో పోలిస్తే ప్రస్తుతం కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల పైనే కాకుండా.. సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ టెస్ట్లు […]
కేసీఆర్కు పోటీగా ప్రియాంక
విభజన తర్వాత ఏపీలో అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. తెలంగాణలో మాత్రం అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ అంతా టీఆర్ఎస్కు దక్కడం కాంగ్రెస్ హైకమాండ్ను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా తెలంగాణ ప్రజల ఆదరణ సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు!! అయితే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఐకమత్యం లోపించడంతో పాటు సీఎం కేసీఆర్ ను డీకొనే సరైన వ్యక్తి లేరని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ […]
నల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అభ్యర్థులు వీళ్లేనా..!
తెలంగాణ రాజకీయాలను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న నల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. నల్లగొండ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేసే పనిలో ఉంది. నల్గొండ ఎంపీ సీటు పరిధిని మొత్తం […]