కేంద్ర మంత్రి,బీజేపీ మాజీ అధ్యక్షుడు,ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ని నట్టేట ముంచిన మొనగాడు..ఈ పాటికే అర్థం అయుంటుంది ..ఆ ఘనాపాటి ఎవరో కాదు మన వెంకయ్య నాయుడు గారే అని.నాయుడు గారి ప్రత్యేక చిందులగురించి ఇప్పుడు మాట్లాడటానికేముంది కానీ నాయుడు గోరు గురివింద నీతులు నెల్లూరులో మరో సారి బయటపడ్డాయి. మైక్ దొరికే ఉపన్యాసాలు దంచేసే వెంకయ్య గారు అధికార ముసుగులో పెద్ద ప్లాన్ వేశారు నెల్లూరు నగరం లో.ఎప్పుడూ నీతి, నిజాయితీ […]
Tag: bjp
మోడీకి మరో షాక్ :సిద్దు జంప్
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గత ఏప్రిల్ నెలలో బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం […]
మేడమ్కి మోడీ షాక్లే షాక్లు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ. ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ […]
రేవంత్రెడ్డికి కౌంటరిచ్చిన కిషన్రెడ్డి
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమేమిటో తెలుసుకోకుండా భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్న రేవంత్రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి కౌంటర్నే ఎదుర్కొన్నారు. బిజెపి తమకు మిత్రపక్షమని కూడా చూడకుండా రేవంత్రెడ్డి వెటకారం చేయడాన్ని బిజెపి సీనియర్ నాయకుడు కిషన్రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లున్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కిషన్రెడ్డిని వివరణ కోరితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కౌంటర్ ఇచ్చారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ […]
నరేంద్రమోడీకి మళ్ళీ వాచిపోయింది
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్కి మళ్ళీ వాచిపోయింది. ఫిరాయింపు రాజకీయాలతో ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్లలో రాజకీయ పెత్తనం చెలాయించాలని చూసిన నరేంద్రమోడీకి దిమ్మతిరిగే షాక్లు తగులుతున్నాయి. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నించి, భంగపాటు ఎదుర్కొంది నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవలే. అది చాలదన్నట్లు అరుణాచల్ప్రదేశ్ రాజకీయాల్లోనూ నరేంద్రమోడీ సర్కార్కి మొట్టికాయ పడింది. 2015 డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్ అప్పటివరకూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించేలా చేసి, కాంగ్రెస్ని […]
టీడీపీ వాళ్ళనూ వదలొద్దు:బీజేపీ
ఏపిలో పార్టీని శరవేగంగా విస్తరించేందుకు బిజెపి తన రోడ్మ్యాప్ను ఖరారు చేసింది.ఆరుగంటల పాటు ఢిల్లీలోని ఏపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేశారు. ”రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టిడిపి వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బిజెపిని బలోపేతం చేయ్యండి” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం నాడిక్కడి […]
అంతకంతకు పెరుగుతున్న అంతరం
అధికారం పంచుకుంటున్న మిత్రపక్షాలు ధ్వంధ్వ విధానాలను అనుసరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార తెలుగుదేశంపార్టీకి నిజమైన మిత్రపక్షమా? లేక అంశాలవారీగా మద్దతుఇస్తున్న విపక్షమా అన్న సందేహాలు కలిగిస్తోంది. పైకి అంశాలవారీగా కొన్నిసార్లు ప్రతిపక్షంగాను లోన మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మిత్రపక్షంగాను భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాంతో అంశాలవారీగా సందర్భానికి తగ్గట్లుగా ఒక్కో విధంగా వ్యవహరిస్తున్న కమలనాధుల తీరుతో ఇటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అయోమయం నెలకొంటోంది. ఇందుకు […]
దేవుడి జోలికెళ్లారు:అనుభవిస్తారు
అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు […]
స్విస్ ఛాలెంజ్: కేంద్రానికి ఇష్టంలేదా?
అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ ఛాలెంజ్కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్ ఛాలెంజ్పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]