ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌.. ఆయ‌న క‌న్నా వీళ్ల‌కే ఆనందం!?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపికైన విష‌యం ఆయ‌నకు ఆయ‌న కుటుంబానికీ ఆనందాన్ని ఇచ్చేదే. అయితే, వీరిక‌న్నా ఎక్కువ‌గా వెంక‌య్య ఏపీ నుంచి వెళ్లిపోతే బాగుండును అని అనుకునేవారే మ‌రింత ఎక్కువ‌గా ఆనందిస్తున్నారు. హ‌మ్మ‌య్య వెంక‌య్య ఇక ఏపీ జోలికి రాడు కాబ‌ట్టి హ్యాపీ అని ఏపీ బీజేపీలోని కొంద‌రు నేత‌లు ఆనందంగా పండ‌గ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ బీజేపీని అన్ని విధాలా ముందుండి న‌డిపిస్తున్నారు […]

టీడీపీ మ‌రోద‌ఫా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్

2019లో అధికారం చేప‌ట్టాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌రికొద్ది రోజుల్లోనే భారీ షాక్ త‌గ‌ల‌నుంద‌ని స‌మాచారం. రాజ‌ధాని ప్రాంతంలోని ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పి బాబు పంచ‌న చేరిపోతున్నార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఓ ఆంగ్ల పత్రిక క‌థ‌నం వెలువ‌రించింది. ఇదే నిజ‌మైతే.. వైసీపీకి రాజ‌ధాని ప్రాంతంలో తీవ్ర‌మైన షాక్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. వియంలో కివెళ్తే.. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి, గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే ముస్తాఫాలు ఇద్ద‌రూ […]

టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాల భాగోతం ఆగ‌దా..!

అవినీతి స‌హించేది లేదు. భ‌రించేది లేదు అని ప‌దే ప‌దే చెప్పుకొచ్చే టీడీపీలో నే ఇప్పుడు అవినీతి కంపు భారీ ఎత్తున క‌మ్మేస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు అవినీతిని తుద‌ముట్టిస్తాన‌ని ప్ర‌క‌టిస్తూ ఉంటే.. ఆ పార్టీ కి చెందిన నేత‌లు . మాత్రం అవినీతికి ఒంట‌బ‌ట్టించుకోవ‌డంలో ముందంజ‌లో ఉన్నారు. ఇటీవ‌లే ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ రావు, దీప‌క్ రెడ్డిల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం వారిని ప్ర‌శ్నించ‌డం తెలిసిందే. దీంతో టీడీపీ ప‌రువు అప్ప‌ట్లోనే భారీగా […]

ఏపీ పాలిటిక్స్‌లో సినీ యుద్ధం

సౌత్ ఇండియా పాలిటిక్స్‌కు సినిమా వాళ్ల‌కు చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స్టార్లుగా ఉన్న‌వారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా సీఎంలు అయ్యారు. త‌మిళ‌నాడులో ఎమ్జీఆర్‌, ఏపీలో ఎన్టీఆర్ అగ్ర‌హీరోలుగా ఎదిగి త‌ర్వాత రాజ‌కీయ పార్టీలు పెట్టి ఏకంగా సీఎంలు అయ్యారు. త‌ర్వాత ఎమ్జీఆర్ వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌ల‌లిత సీఎం అయ్యి త‌మిళ‌నాడును శాసించారు. ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్ త‌ర్వాత హీరోలు, హీరోయిన్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఎంతో మంది రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా వీరి రేంజ్‌లో […]

జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]

ఆంధ్రాని మళ్ళీ మోసంచేయడానికి సిద్ధమైన బీజేపీ

హోదాపై ఎన్నెన్ని మాట‌లు చెప్పారు! ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇవ్వాల‌న్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! త‌ర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. న‌మ్మించి న‌ట్టేట ముంచారు బీజేపీ నేత‌లు! ఇక విశాఖ రైల్వే జోన్ విష‌యంలోనూ ఇవే మాయ మాట‌లు చెబుతున్నారు! త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్ర‌యత్నం చేస్తున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా.. ఏపీ ప్ర‌జ‌ల […]

వైసీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ… ఎంపీ-ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి జోష్ వ‌స్తోంది. అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీ త‌ర్వాత ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌లు ప‌థ‌కాలు కాస్త ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వాటి గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో మ‌రో ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబం ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా ఎంతో ప‌ట్టున్న మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. కోట్ల […]

పార్టీనే నమ్ముకున్న టీడీపీ సీనియ‌ర్ల‌కు బాబు షాక్!

టీడీపీని న‌మ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉండ‌డంతో పాటు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల కోసం త‌మ సీట్లు వ‌దులుకుని త్యాగాలు చేసిన వాళ్ల‌కు చంద్ర‌బాబు సింపుల్‌గా కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌తో స‌రిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ను నియమించాలని […]

ఆ పంచాయితీల‌తో బాబు ఉక్కిరిబిక్కిరి

ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కంచుకోట‌ క‌డ‌ప గ‌డ‌ప‌లో ప‌సుపు జెండా రెపరెప‌లాడాల‌ని సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌నయుడు లోకేశ్ విశ్వప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టేశారు. ప్ర‌స్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మ‌ధ్య విభేదాలు ర‌గులుతున్నాయి. ఆది చేరిక‌ను వ్య‌తిరేకిస్తున్న రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గంతో ప్ర‌స్తుతం అధిష్ఠానానికి ముచ్చెమ‌ట‌లు ప‌డుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోక‌లి […]