వైసీపీ టీం..నిధుల కోసం ఢిల్లీలో వేట!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి.. పలు పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితీ అంతంత మాత్రమే.. కేంద్రప్రభుత్వం కూడా నిధలడిగితే మొహం తిప్పుకుంటోంది.. రాష్ట్ర పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే పట్టువదలని విక్రమార్కుడులా కేంద్రం వద్దకు పదే పదే నిధుల కోసం వెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక రాష్ట్ర ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు. […]

ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ).. ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్.. మోదీ ప్రభుత్వం వీఎస్పీ ప్రైవేటు పరం చేయనున్న నేపథ్యంలో దానిని కాపాడుకోవడానికి.. ముఖ్యంగా రాజకీయ లబ్ధి పొందడానికి పలు పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీఎస్పీ ఉద్యమ కారులకు మద్దతు తెలుపుతూ లేఖ రాయడం.. అధికార పార్టీ కూడా సహకరించాలని..  మా పార్టీ వాళ్లు రాజీనామా చేస్తారు.. వైసీపీ వాళ్లు కూడా చేయాలని పేర్కొన్నారు. అంటే వీఎస్పీ పరిరక్షణకు […]

రాజమండ్రి తెలుగుదేశం.. ఇలా ఎందుకుందండీ..

తెలుగుదేశం పార్టీకి కంచుకోట రాజమండ్రి .. అక్కడ టీడీపీదే హవా.. ఆ నాయకులు చెప్పిందే వేదం.. ఒకప్పుడు.. అయితే ఇపుడు సీన్ మారిపోయింది.. వారి పార్టీ అక్కడ బలంగానే ఉన్నా నాయకులు మాత్రం నువ్వా..నేనా అని కత్తులు దూసుకుంటున్నారు. వీరి వ్యవహారం చూసిన కార్యకర్తలు.. అరె.. పార్టీని వీరే నాశనం చేసేలా ఉన్నారే అని బాధపడుతున్నారట.  2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఉన్నా రాజమండ్రిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే […]

పోటీలో ఉన్నాం.. సరే పరిగెత్తడం ఎలా.. గెలిచేదెలా..?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక రకమైన నిస్తేజం నెలకొంది. అధికార పార్టీ రాష్ట్రంలో పరుగెత్తుతుంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం కనీసం నడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు.  పార్టీకి కేడర్ లేదా అంటే బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు అనే చెప్పవచ్చు. మరి ఎందుకిలా జరుగుతోంది అంటే  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడే అని చెప్పవచ్చు. యువతరంతో పోటీ పడాలంటే యువకులే ఆలోచించాలంటున్నారు తెలుగు తమ్ముళ్లు. […]

ఏపీ బీజేపీ కొత్త రాగం.. ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో..?

ఏపీలో ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీగా తెలుగుదేశం పార్టీగా గుర్తింపు ఉంది.  వారే.. కాదు మేము కూడా ఉన్నాం రాష్ట్రంలో.. ప్రభుత్వం చేసే తప్పులను మేము కూడా ఎత్తిచూపుతాం అంటున్నారు బీజేపీ నాయకులు. జనం తమను గుర్తించాలని వారు చేయని ప్రయత్నం లేదు.  అందుకే ఇపుడు ఆలయ పరిరక్షణ అనే కార్యక్రమం రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల చుట్టూ తిరిగి వాటిని పరిరక్షిస్తాడట. కమలం నేతలు, కార్యకర్తలు వెంటరాగా ఆలయాల వద్దకు […]

వామ్మో..! ఇంతమంది సలహాలిస్తున్నారా.. ఇదేంది సామీ..!

ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 41 మంది సలహాలిస్తున్నారా? ఏం సలహాలిస్తున్నారు? ఎన్ని సలహాలిస్తున్నారు? అదీ లక్షల రూపాయలు తీసుకుంటూ.. అని జనం మందిలో ఇపుడు లక్ష ప్రశ్నలు మెదులుతున్నాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 41 మంది నిపుణులు సలహాలిస్తున్నారని.. వారంతా ప్రభుత్వ సలహాదారులని కోర్టుకు చెప్పడంతో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. వీరికి కల్పిస్తున్న సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవే అని అడగడం.. ఇది పేపర్లలో రావడంతో జనం మదిలో ఆలోచనలు మొదలయ్యాయి.   తనకు, తన […]

బెజవాడ ‘దేశం’లో నాలుగు స్తంభాలాట…. !

బెజవాడ.. విజయవాడ.. పేరేదైనా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. అధికార పార్టీలో కాదు గానీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నిప్పు..ఉప్పులా ఉంటున్నారు బెజవాడ నాయకులు. గతంలో విజయవాడ దేశం నాయకులు బలంగా ఉండేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. అర్బన్ నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగామారారు. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అధినేతకు అర్థం కాక అలా వదిలేశాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నలుగురు నాయకులు నాలుగు దిక్కులుగా […]

లోకేష్ లక్ష్యం.. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే..

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. పార్టీకి భవిష్యత్ నేత ఈయనే అనేది అధినేత. తండ్రి చంద్రబాబు ఆశ..ఇవన్నీ సాధ్యం కావాలంటే లోకేష్ ముందుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి.. అధ్యక్షా.. అని మాట్లాడాలి.. అదే ఇపుడు ముందున్న లక్ష్యం.. 2019 ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రీకొడుకులకు మంగళగిరి వాసులు షాక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి చేతిలో ఓలమి పాలయ్యారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కుమారుడే (చంద్రబాబు అప్పుడు సీఎం) ఓటమి […]

సమయం ఆసన్నమైంది మిత్రమా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకుందామా.. !

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి వర్గవర్గ విస్తరణ సమయంలో పలువురికి చోటు కల్పించారు. రెండున్నర సంవత్సరాల తరువాత కేబినెట్ మినిస్టర్స్ చేసిన పనిని బేరీజు వేసుకొని మార్పులు చేస్తానని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. మరి టీమ్ లో ఎవరుంటారో.. ఎవరు బయటకు వెళతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే జగన్ మదిలో ఉన్నది ఎవరికీ చెప్పడు అని సీఎంకు సన్నిహితంగా ఉన్నవారే చెబుతారు. దీంతో బెర్త్ […]