అదేం ఖర్మమో తెలియదు కానీ.. పార్టీ పుంజుకుంటోంది.. ప్రజలు మనవైపు మొగ్గుతున్నారు.. అని భావించే సమయంలో బీజే పీలో పెద్ద ప్రకంపన మొదలవుతోంది. అధికార పార్టీపై.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వచ్చి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అప్పటి వరకు స్థానికంగా దూకుడు చూపించి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నాయకులు.. చతికిల పడుతున్నారు. అంతేకాదు.. ఇక ప్రజల ముందుకు ఎలా వెళ్లాలనే తపన చెందుతున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. “మేం ఎంతో కష్టపడుతున్నాం. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం. […]
Tag: andhra pradesh
2024 ఎన్నికల్లో గెలుపే టార్గెట్గా జగన్ తెరచాటు వ్యూహం… దిమ్మతిరగాల్సిందే..!
రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు.. అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాజధాని విషయం.. ఇప్పుడు ఆమూలాగ్రం చర్చకు వస్తోంది. ఒకవైపు.. రాజధాని రైతులు మహాపాదయాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజధానిపై చర్చిద్దాం.. రమ్మని పిలుపునిచ్చింది. మూడు రాజధానులు కాదు.. ఒకే రాజధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. దరిమిలా.. మూడు రాజధానులకే తమ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయకులు.. ప్రకటనలు ఇస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. వైసీపీ ప్రభుత్వం.. ఏం […]
ఏపీ ప్రజలపై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్… ఈ సారి నమ్మలేమా….!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఏపీ రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామ ని.. ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్న రాష్ట్ర కమలనాథులు.. రైతులు చేస్తున్న పాదయాత్రలోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల పక్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు.. రాజధాని విషయంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారిందని.. తమకు అండగా ఉంటుందని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికీ.. బీజేపీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]
టీడీపీ సవాల్ను స్వీకరిస్తారా… జగన్ కు పెద్ద పరీక్షే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సమావేశాలను ఐదు రోజులకే పరిమితం చేసి నా.. ప్రభుత్వ వ్యూహం మాత్రం మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి.. రాజ ధాని అమరావతి గురించిన చర్చ ప్రారంభమైంది. ఒకవైపు రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగనుంది. అయితే.. దీనిని తమపై చేస్తున్న దండ యాత్రగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజధానులను ఎవరూ కట్టడి […]
రాజధానిపై వైసీపీ గరంగరం.. లైట్ తీసుకున్న జనాలు…!
ఏపీ రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎకరాల భూములు ఇచ్చామని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామని.. రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వైపు.. ప్రజలు నిలబడుతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఇటు వైపు న్యాయవ్యవస్థ.. అటువైపు ప్రజలు కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం […]
జనసేనలో ఉన్న ఆ మైనస్సే వైసీపీకి ఇంత ప్లస్ అవుతోందా…!
ఔను.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. పంచదార చుట్టూ.. చీమలు చేరినట్టు గా ఎక్కడ అవకాశం ఉంటే.. ఎక్కడ అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తే.. ఆ పంచకు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల విషయంలో ఎవరు ఎవరితో కలుస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయినప్పటికీ.. అధికార పార్టీలోని కొందరు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావహులు […]
కొడాలి పన్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్రబాబు…!
ఏదైనా చేస్తే.. దానివల్ల.. పార్టీకి, పార్టీ నాయకులకు ప్లస్ అవ్వాలి. లేదా.. ప్రత్యర్థి పార్టీలకు మైనస్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాలకు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ లబ్ధి చేకూరే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టీడీపీ ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. ఇటీవల మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై ఆయన నోరు చేసుకున్నా రని.. పేర్కొంటూ.. టీడీపీ నాయకులు […]
ఏపీ, తెలంగాణలో శృంగార సర్వేలో ఆసక్తికర విషయాలివే…!
అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]
ఏపీలో వినాయక చవితి రాజకీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?
అత్యంత సున్నితమైన అంశాల విషయంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వమైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. అది రాజకీయంగా ప్రభావం చూపిస్తుం దనే వాదన ఉంటుంది కాబట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో.. ఎవరు ఏం చెబుతున్నారో.. తెలియదు కానీ.. కీలకమైన హిందూ సామాజిక వర్గం విషయంలోప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వివాదానికి కారణంగా మారుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి […]