చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]

అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!

గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]

ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]

జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?

రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]

రామ్ గోపాల్ వర్మ – పేర్ని నాని.. కౌంటర్ ఎటాక్.. ఎవరిది పైచెయ్యి..?

సోషల్ మీడియా వేదికగా ఏపీ లో సినిమా టిక్కెట్ల ధరల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు చేసిన ట్వీట్లు పెద్ద దుమారం రేపుతానయి.రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కు గాను ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని ఇచ్చిన కౌంటర్ కు రామ్ గోపాల్ వర్మ రి కౌంటర్ ఇచ్చారు. ప్రతుతం సోషల్ మీడియా వేదికగా రామ్ […]

వేటు పడకముందే వెళ్లే అవకాశం..

ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. […]

అందుకే బాబు కుప్పం టూర్..

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలు పెడితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ప్రాభవం కోల్పోయింది. అధికార వైసీపీ వైపే జనం మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ముందనుంచీ కుప్పంలో టీడీపీ పాగా వేసింది. చంద్రబాబు నాయుడు అంటే కుప్పం గుర్తుకొస్తుంది. అటువంటి కుప్పం ఇపుడు ఫ్యాను కింద […]

ఈ టైంలో సంబరాలేంది సామీ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ 2 అయిన కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. స్వయంగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నాడో అధికారులకు అంతుచిక్కడం లేదు. ఆయన అలా చేయడం తప్పని చెప్పే వాళ్లు కూడా లేకపోవడంతో ఆయన నోటి వెంట అలా మాటలు వచ్చేస్తున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు ఆ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. […]