ఇప్పుడు అందరూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్రజల పక్షాన నిలిచిన జనసేని.. స్వయంగా బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మరీ చర్చించారు. బాధితుల రోదనలు స్వయంగా చూశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్కరాల పేరుతో రూ.250 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలకు జనాలు నానాతిప్పలు పడుతున్న సంగతి తెలియడం లేదా? అని ప్రశ్నించారు. ఒకరకంగా అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ […]
Category: Latest News
కేసీఆర్ తో స్నేహం కాదు..రణమే..!
జాతీయ పార్టీ బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదిగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతుండగా.. తెలంగాణలో మాత్రం ఎలాంటి పొత్తూ లేకుండా ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విభజనకు బీజేపీ మద్దతు వెనుక ఉన్న వ్యూహం ఇదే. చిన్న రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు అవకాశం మెండుగా ఉంటుందని బీజేపీ నమ్ముతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి మద్దతిస్తూ వచ్చింది. ఇక, ఇప్పుడు రెండు […]
వైకాపాలో ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరిదో..!
వైకాపాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తోంది! ఒక రొట్టె వంద జీవులు అన్నటైపులో ఈ పార్టీకి శాసన సభ్యుల లెక్క ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు లభించనుంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియర్ మోస్ట్ లీడర్లు కాచుకుని ఉన్నారు. దీంతో వీరి ఎంపిక ఇప్పుడు వైకాపా అధినేత జగన్కి కంటిపై కునుకు లేకుండా చేస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితిలో వైకాపా నేతలు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. దీంతో […]
టీ కాంగ్రెస్ సారథిగా అజారుద్దీన్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కకావికలమవుతున్నాయి. కేసీఆర్ వేసే ఎత్తులకు ప్రతిపక్షాలన్ని చిత్తుచిత్తవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్కు ధీటుగా ఫైట్ చేయలేకపోతోందన్న అభిప్రాయం టీ పాలిటిక్స్లో వినిపిస్తోంది. టీ పాలిటిక్స్లో సీనియర్ లీడర్లుగా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి – జానారెడ్డి – భట్టి విక్రమార్క్ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి – డీకే అరుణ – జీవన్రెడ్డి ఇలా ఎవరిని చూసుకున్నా సఖ్యత లేకపోవడంతో కేసీఆర్కు తిరుగేలేకుండా పోతోంది. వీరిలో […]
టీఆర్ఎస్లో హరీష్రావు ప్రయారిటీ ఏంటి?
ఇప్పుడు తెలంగాణ మేధావులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా తానై మేనమామ కేసీఆర్ చెప్పినట్టు నడుచుకొన్న ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయారనే టాక్ వినబడుతోంది. వాస్తవానికి తెలంగాణలో ఏ సమస్య ఎదురైనా ఇటు క్లాస్ అటు మాస్లోకి దూసుకుపోయి.. సమస్యలను పరిష్కరించడంలో హరీష్.. తన స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనను తొక్కేస్తున్నారనే టాక్ వినబడుతోంది. టీఆర్ ఎస్లో ఆధిపత్య పోరు మొదలైనప్పటి నుంచి పరోక్షంగా హరీష్ను తెరవెనుకకే పరిమితం […]
రోజాకి పోటీగా మంచు లక్ష్మి..!
గత కొన్నాళ్లుగా కలెక్షన్ కింగ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టే కనిపిస్తోంది! పోలిటికల్గా తాను పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా.. తన కూతురు మంచు లక్ష్మిని రంగంలోకి దింపాలని మోహన్ బాబు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేతను అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక వంకతో ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కూతురిని వెంటబెట్టుకుని మరీ కలిశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జనవరి 1న కూడా చంద్రబాబు తన […]
కోదండరాం పార్టీతో టీఆర్ఎస్కు ఎఫెక్ట్ ఎంత
దేశంలో ఉద్యమాల మీద ఉద్యమాలు చేసి పట్టుబట్టి రాష్ట్రం సాధించిన 29వ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో రికార్డు సృష్టించనుందనే టాక్ వినిపిస్తోంది! అదేంటంటే… పొలిటికల్గా తెలంగాణ మరో యూ టర్న్ తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో అన్నీతానై మేధావులను కదిలించి నిత్యం పత్రికల్లో ఏదో ఒక వ్యాసం లేదా ఆర్టికల్తో ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు సరికొత్తగా పార్టీకి శ్రీకారం చుడుతున్నారనే వార్తలు […]
యూపీలో కూడా అదే రిజల్ట్ వస్తుందా..!
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం కోసం అధికార ఎస్పీతో పాటు అక్కడ ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే 2019 ఢిల్లీ పీఠానికి మార్గం చాలా వరకు సుగమం అయినట్టే. అందుకే దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు పైన చెప్పిన పార్టీలన్ని సర్వశక్తులా పోరాడుతున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న ట్రెండ్ను బట్టి చూస్తుంటే, జాతీయ మీడియాలో జరుగుతున్న […]
బాబు ప్లాన్తో జగన్కే మేలా..!
ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో రైతులు అందరూ తనకు సహకరించారని, దాదాపు 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారని ప్రతి చోటా చెప్పుకొనే చంద్రబాబు.. ఇప్పుడు ఇదే విషయంలో ఆంక్షలు విధిస్తున్నారనే టాక్ మొదలైంది. రైతులు తమ ఇష్టప్రకారం కొంత మేరకు మాత్రమే భూములు ఇచ్చారని, మిగిలిన భూములను ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు రైతులు ఇటీవల వైకాపా అధినేత […]