విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప్రతిపక్ష నేత జగన్ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
Category: Latest News
వెంకన్నను కూడా పట్టించుకోలేనంత బిజీనా బాబూ..!
వరుస సమీక్షలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు.. ఇలా నిత్యం తలమునకలై ఉండే సీఎం చంద్రబాబు.. తిరుమల వేంకటేశ్వరుడి పాలనా వ్యవహారాలు మాత్రం పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమించాలో తెలియక.. సతమతమవుతున్న ఆయన.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీని కూడా నియమించుకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే! ఇదే సమయంలో అథారిటీని కూడా నియమించకుండా కాలయాపన చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. సాక్ష్యాత్తూ […]
ఒకే జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!
ఈ హెడ్డింగే చాలా షాకింగ్గా ఉన్నట్టు కనిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయడమా ? ఇది నిజమేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్రత్తిపాడు […]
ఆ పంచాయితీలతో బాబు ఉక్కిరిబిక్కిరి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ప్రస్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మధ్య విభేదాలు రగులుతున్నాయి. ఆది చేరికను వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంతో ప్రస్తుతం అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోకలి […]
జనసేన సర్వే నిజమా..? కామెడీనా…?
2019 ఎన్నికల్లో జనసేన 83 సీట్లు గెలుస్తుందంటూ జనసేన అభిమాని నిర్వహించిన సర్వేలో తేలడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్న సమయంలో.. ఈ సర్వే రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయకులు, ఇటు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సర్వే నిజమా? అబద్దమా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణమే పూర్తిగా లేని జనసేనకు […]
సబితా ఇంద్రారెడ్డి ప్లాన్…హైకమాండ్ ఒప్పుకుంటుందా ?
మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయంగా పెద్ద యాక్టివ్గా ఉండడం లేదు. గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సబితా టీ కాంగ్రెస్లో సీనియర్ నాయకుల దూకుడు ముందు పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న ఆమె ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు టీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హోం మంత్రి అయిన సబితా […]
`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!!
ప్రతిపక్ష వైఎస్సార్సీపీలో గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కుమ్ములాటలకు కొదవలేదు. ఇవి నిత్యం రగులుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ కంటే తూర్పు గోదావరిలో కొంత బలం ఉన్న విషయం తెలిసిందే! అందుకే మరింత బలపడేం దుకు ఒక్కో నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒకరికంటే ఎక్కువమందిని నియమించేశారు. ఇవే ఇప్పుడు ఆయనకు తలనొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా తమకేటికెట్ దక్కుతుందని.. […]
తెలుగు మీడియాలో మరో పత్రిక వస్తోందా..?
స్వాతంత్య్ర సంగ్రామం కీలక దశలో ఉన్న సమయంలో.. ప్రజల్లో దేశభక్తిని రగిలించడంలో పత్రికలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. అయితే తదనంతరం కాలంతో పోటీపడలేక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోలేక ఇవి కనుమరుగైపోయాయి. అలాంటి పత్రికకు జీవం పోసేందుకు పాత్రికేయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగు మీడియాలో.. మరోసారి దీనిని తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అదే ఆంధ్ర పత్రిక!! జాతీయోద్యమానికి ఊపిరులూదిన పత్రిక.. భిన్నమైన శైలితో ఆనాటి పాఠకులను సమ్మోహితుల్ని చేసిన పత్రిక.. దేశభక్తిని అణువణువునా నింపిన పత్రిక.. ఆంధ్రపత్రిక. […]
బీజేపీలోకి చంద్రబాబు అనుచరుడు..!
ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రియ శిష్యుడు. చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సదరు పారిశ్రామికవేత్తకు చంద్రబాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయన గెలిచారు. సదరు పారిశ్రామికవేత్త కోసం చంద్రబాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియర్ను కూడా వదులుకున్నారు. మరి చంద్రబాబు అంతలా ప్రయారిటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణలోని ఖమ్మం […]
