తెలుగు మీడియాలో మ‌రో ప‌త్రిక వ‌స్తోందా..?

స్వాతంత్య్ర సంగ్రామం కీలక ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌జ‌ల్లో దేశ‌భ‌క్తిని ర‌గిలించ‌డంలో ప‌త్రిక‌లు కూడా ప్ర‌ధాన పాత్ర పోషించాయి. అయితే త‌ద‌నంత‌రం కాలంతో పోటీప‌డ‌లేక‌, మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోలేక ఇవి క‌నుమ‌రుగైపోయాయి. అలాంటి ప‌త్రిక‌కు జీవం పోసేందుకు పాత్రికేయులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తెలుగు మీడియాలో.. మ‌రోసారి దీనిని తీసుకొచ్చేందుకు శ్ర‌మిస్తున్నారు. అదే ఆంధ్ర ప‌త్రిక!! జాతీయోద్య‌మానికి ఊపిరులూదిన ప‌త్రిక‌.. భిన్న‌మైన శైలితో ఆనాటి పాఠ‌కుల‌ను స‌మ్మోహితుల్ని చేసిన ప‌త్రిక‌.. దేశ‌భ‌క్తిని అణువ‌ణువునా నింపిన ప‌త్రిక‌.. ఆంధ్ర‌ప‌త్రిక‌. […]

బీజేపీలోకి చంద్ర‌బాబు అనుచ‌రుడు..!

ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్రియ శిష్యుడు. చంద్ర‌బాబు ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చిన స‌ద‌రు పారిశ్రామిక‌వేత్తకు చంద్ర‌బాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయ‌న గెలిచారు. స‌ద‌రు పారిశ్రామిక‌వేత్త కోసం చంద్ర‌బాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియ‌ర్‌ను కూడా వ‌దులుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు అంత‌లా ప్ర‌యారిటీ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణ‌లోని ఖ‌మ్మం […]

ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం

తాను ఎవ‌రి మాట లెక్క‌చేయ‌బోన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే పార్టీలో సీనియ‌ర్ల‌కు ఆయ‌న మ‌న‌స్త‌త్వం గురించి తెలుసు క‌నుక స‌ల‌హాలు ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌బోవ‌డం లేదు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌కు కూడా జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్ట‌మైన‌దే చేస్తా` అని చెప్ప‌క‌నే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాలి, ఎవ‌రైతే బాగుంటుంద‌నే అంశాల‌పై ఇప్ప‌టికే ప్ర‌శాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ […]

ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేపై బాబు నిఘా..!

ఎన్నిక‌లు, క‌ప్ప‌దాట్లు, జంపింగ్ జ‌పాంగ్‌లు ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో కామ‌న్ అయిపోయాయి. ఈ మూడేళ్ల‌లో విప‌క్ష పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఏపీలో అధికార టీడీపీ, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెండేళ్లు కూడా టైం లేదు. అయితే వీరంతా ఇప్పుడు ఉన్న అధికార పార్టీల్లోనే ఉంటారా ? అంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో పార్టీలోకి కూడా జంప్ చేసేందుకు త‌మ ప్ర‌య‌త్నాల్లో తాము ఉన్నార‌ట‌. ఇక ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో […]

లోకేశ్ మాట‌లు బెదిరింపులా..?  బ్లాక్ మెయిలా..?

స‌దావ‌ర్తి భూముల అంశంపై మంత్రి లోకేశ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బెదిరిస్తున్నారా? లేక బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనిపించేలా ఆయ‌న మాట్లాడుతున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో స‌ర్కారు ఇరుకున ప‌డింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూముల‌ను నామ‌మాత్ర‌పు వేలంపాట‌తో కేవ‌లం రూ.22 కోట్ల‌కు కొట్టేసేందుకు ప్ర‌యత్నించింద‌ని వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిల్ దాఖ‌లు చేయ‌డం.. అందుకు ప్ర‌తిగా రూ.5కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామ‌ని స‌ర్కార్ స‌వాలు విస‌ర‌డం తెలిసిందే! […]

గ‌జ్వేల్‌కు కేసీఆర్ బైబై…. ఆ నియోజ‌క‌వ‌ర్గంపై  క‌న్ను..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వ‌హిస్తోన్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి గుడ్ బై చెప్ప‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రో కొత్త నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌చ‌ట్టంలో పేర్కొన్న నియోజ‌క‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి ఏపీలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీతో పాటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ సైతం […]

వైసీపీలోకి నాగార్జున‌…. జ‌గ‌న్‌తో కింగ్ డీల్ ఏంటి

దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మ‌న్మ‌థుడిగా, కింగ్‌గా టాలీవుడ్ అభిమానుల మ‌న‌స్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బ‌య‌టా నాగార్జున వ్య‌క్తిత్వం కాస్త భిన్నం. వివాదాల‌కు దూరంగా అంద‌రితోను స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లే నాగ్‌ది ప‌క్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబ‌డికి చాలా రెట్లు ఎలా రాబ‌ట్టుకోవాలో నాగ్‌కు బాగా తెలుసు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే నాగ్ అక్ర‌మ ఆస్తులు, క‌ట్ట‌డాల‌ను టార్గెట్ […]

పీకే జ‌వాబుతో అంద‌రూ ఫూల్స్

`వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లు ఇందులో తేలింది. టీడీపీకి మ‌రోసారి విజ‌యం గ్యారెంటీ` అని టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో కొంత‌మంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించేశారు. ప్ర‌స్తుతం వీరి అత్యుత్సాహం నీరుగారిపోయింది. ఇప్పుడు వీళ్లంతా ఫూల్స్ అయిపోయారు. వైఎస్ఆర్ సీపీని, నేత‌ల‌ను ఇరుకున పెట్టి సోష‌ల్ మీడియాలో వీలైనంత వ‌ర‌కూ ల‌బ్ధి పొందాల‌ని చూసిన వీరంతా.. `ఇదంతా […]

నంద్యాల టీడీపీలో `ఎవ‌రికి వారే య‌మునా తీరే’

నంద్యాల ఉప ఎన్నిక‌ల అధికార పార్టీ నేత‌ల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న నాటి నుంచి వ‌రుస విభేదాలు ర‌గులుతున్న వేళ‌.. అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డ్డాయ‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల్సిన చోట `ఎవ‌రికి వారే య‌మునా తీరే` అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా త‌మ‌కు ప‌ట్టున్న నియోజక‌వ‌ర్గంలో వేరే వారికి గెలుపు బాధ్య‌తలు అప్ప‌జెప్ప‌డాన్ని మంత్రి అఖిల‌ప్రియ జీర్ణించుకోలే క‌పోతున్నారు. తన తండ్రి నియోజక‌వ‌ర్గంలో.. ఇత‌రుల ప్ర‌మేయంపై తీవ్ర […]