ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలయ్య బాబు కుమార్తె బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మణిని లోక్ సభ కు పంపాలని బాబు గత కొన్నాళ్ల కిందటే డిసైడయ్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా […]
Category: Latest News
ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీలకు 2019లో సారి
ఏపీ సీఎం చంద్రబాబు ఈ సారి టిక్కెట్ల విషయంలో కాస్త కటువుగానే వ్యహరిస్తారా ? వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి వరుసగా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పక్కన పెట్టేయనున్నారా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వగా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో […]
టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన మోదీ
మిత్రపక్షం మాటలు గాలిలో కలుస్తున్నాయి. మిత్ర ధర్మానికి బీటలు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మధ్య బంధం బలోపేతం అవుతోంది. కమలం చెంతకు ఫ్యాన్ క్రమక్రమంగా దగ్గరవుతోంది. ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కలయితతో బీజం పడిన స్నేహ బంధం.. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరింత చిగురించింది. రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు వైసీపీకి కూడా ఆహ్మానం అందడం.. ఏపీలో మరోసారి […]
నంద్యాలలో కాంగ్రెస్ టార్గెట్ ఎవరు?
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన సమయంలో ఉనికి చాటాలని ప్రయత్నిస్తోంది. వీలైనంత వరకూ పోటీలో నిలిచి అధికార, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలని చూస్తోంది! ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావిస్తోంది. నంద్యాల ఎన్నికలను సరైన వేదికగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం నంద్యాలలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బరిలోనే నిలుస్తుండగా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామని ప్రకటించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెలవకపోయినా.. […]
దిక్కుతోచని పరిస్థిలో టీఆరెస్ ఎమ్మెల్యే
తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బతో అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యేకు జ్వరం పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తనకు టిక్కెట్ ఇవ్వనన్న ఫ్రీలర్లు వదలడంతో ఇప్పుడు సదరు ఎమ్మెల్యే తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారట. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెందిన చాలా మంది ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ జాబితా చాలానే ఉంది. ఈ జాబితాలోకి కొత్తగా వచ్చి చేరారు మెదక్ ఎంపీ కొత్త […]
పాలకొల్లు మరో గరగపర్రు అవుతోందా..!
పశ్చిమగోదావరి జిల్లాలోని గరగపర్రు ప్రస్తుతం అట్టుడుకుతోంది. అక్కడ దళితవర్గాలకు చెందిన వారిని వెలివేశారన్న వార్తలతో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గరగపర్రులో దళితులంతా ఉద్యమిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాలకొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు యాంటీగా ఒక్కటవుతున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని బీసీలతో పాటు కోనసీమలో బలహీనవర్గాల్లో బలమైన ఓ ప్రధాన సామాజికవర్గం మొత్తం నిమ్మలకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. నిమ్మల పాలకొల్లు నియోజకవర్గంలో […]
టీడీపీలో సస్పెన్షన్ల పరంపర..మరి ఆ ఇద్దరి ఎంపీల సంగతేంటో..?
ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ సస్పెన్షన్ల పర్వానికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ జాబితాలో చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి కౌన్సెలర్ల వరకు ఉంటున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఏకంగా ఒకరిద్దరు ఎంపీలు సైతం పార్టీనే ధిక్కరిస్తున్నారు. వారి పేర్లు సైతం సస్పెన్షన్ జాబితాలో ఉన్నా వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునేందుకు సాహసించలేని పరిస్థితి. టీడీపీ సస్పెన్షన్ల పరంపరలో మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ […]
టీఆర్ఎస్ కీలక నేతల మౌనం.. అసలేం ఏం జరిగింది?
తెల్లారింది మొదలు పొద్దు గూకే వరకు మీడియా మైకుల ముందు మాటల ప్రవాహంతో విపక్షాలను దంచికొట్టే.. టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటించేస్తున్నారు! ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రి హరీష్రావు, నాయిని తదితర ప్రధాన పోస్టుల్లో ఉన్న నేతలు సైతం ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మరో రెండేళ్లలో కీలకమైన ఎన్నికలు రాబోతున్న తరుణంలో నేతలు ఇలా గప్చుప్ అయిపోవడం.. ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఇటీవల కాలంలో విపక్షాల […]
ఇద్దరు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?
ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల వైఖరే డిఫరెంటు. ఈ ఇద్దరూ అవసరాన్ని బట్టి తిట్టుకోవడం, అవసరాన్ని బట్టి పొగుడుకోవడం పరిపాటైంది. నిన్న మొన్నటి వరకు కృష్ణా వాటర్ విషయంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి నామినేష్ ఘట్టానికి వెళ్లిన సందర్భంలో మాత్రం చిరునవ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవరికివారే సొంత లాభం లేకుండా […]