ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక ట్విస్టులతో రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడం, తర్వాత హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మృతి చెంది సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ లోగానే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగైదు రోజుల్లోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ […]
Category: Latest News
ఉంగుటూరు ఎమ్మెల్యే గన్నిది కొత్త రూటా..? పాత రూటా..?
ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా పశ్చిమగోదావరి. నియోజకవర్గాల పునర్విభజన వార్తలు ఇక్కడ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. నియోజకవర్గాలు కొత్తగా మారితే ? తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలి ? అన్న ప్రశ్న ఇప్పుడు వీళ్లకు పెద్ద సంకటంగా మారాయి. ఈ క్రమంలోనే ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ? ఆయన రూటు ఎలా ? ఉంటుంది ? […]
అఖిల మారకపోతే ఆళ్లగడ్డలో ఈ సారి కష్టమే
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బలమైన నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ ఐదుసార్లు గెలిచిన దివంగత భూమా నాగిరెడ్డి సతీమణి, దివంగత శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గట్టిగా పనిచేసిందని స్పష్టమవుతోంది. ఇక […]
నంద్యాలలో టీడీపీకి వైసీపీ గట్టిపోటీ!
నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే అధికార పార్టీ టీడీపీ ఎన్నికల వేడిని అమాంతం పెంచేసింది. సాక్షాత్తూ.. చంద్రబాబే నేరుగా నంద్యాలలో ఇప్పటికి రెండు సార్లు పర్యటించారు. రాత్రు ళ్లు కూడా ఆయన అక్కడే మకాం వేస్తూ.. ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుబట్టారు. మరి అధికార పక్షం ఇంతచేస్తే.. అసలు ఈ సీటు నుంచి 2014లో గెలుపొందిన వైసీపీ ఊరుకుంటుందా? జగన్ అసలు ఊరుకుంటాడా? మళ్లీ తామే ఈ సీటు నుంచి గెలిచి […]
సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్ పెడుతోన్న కవిత
పాలిటిక్స్లో ఎప్పుడు ఏమౌవుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు అయిన వాళ్లు పగవాళ్లవుతారో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణలో ఏర్పడింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో రకరకాల సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగులకు పొగబెట్టే కార్యక్రమాలు వరుసగా జరిగిపోతున్నాయి. విషయంలోకి వెళ్తే.. నిజామాబాద్లోని బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊతాన్నిచ్చిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి కేసీఆర్ ఆశీస్సులతో ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలిచి మూడేళ్లు పూర్తయింది. అంతా సజావుగానే […]
కొత్త పలుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్కు అంతేలేదా!
లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడం కొన్ని పత్రికలకు అలవాటుగా మారిందనే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త పలుకు ఈ నానుడిని మరోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అరసగం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవల పూర్తి నిరాధారంగా మారిపోయిందని, అతిశయోక్తులకు అడ్డాగా మారిపోయిందని పలువురు చెప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించినా నిజం. తాజా విషయానికి వస్తే.. చాన్నాళ్ల తర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బద్ధ పదవైన ఉపరా […]
రాజ్యసభలో వెంకయ్య సీటు ఎవరికి దక్కేనో?
ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన గెలుపు నల్లేరుపై నడకేననేది తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఖాళీ అయిన వెంకయ్యనాయుడు రాజ్యసభ సీటు కోసం అప్పుడే లొల్లి మొదలైంది. ఈ సీటును నాకు కేటాయించండి అంటే .. నాకు కేటాయించండి .. […]
జగన్ ప్లాన్లో బాబును ముంచుతున్నాడా..!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఎదురవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా పదవులపై ఆశలు పెట్టుకున్న వారి విషయంలో వారు ఏ పార్టీకి పరిమితం అవుతారు? అని చెప్పడం ఇంకా కష్టం. నిన్న మొన్నటి వరకు పదవులపై ఆశలతోనే వైసీపీ నుంచి టీడీపీకి వరుస పెట్టి జంప్ చేసిన నేతలను మనం చూశాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పాటుపడుతున్నారని అందుకే తాము పార్టీ మారామని చెప్పుకొచ్చిన నేతలు ఎక్కడ తమకు అనుకూలంగా ఉంటే అక్కడి జంప్ చేయడానికి సిద్ధంగా […]
బాహుబలి 3 హీరో ఎవరో తెలుసా
దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ బాహుబలి సినిమా వరల్డ్ వైడ్గా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసి ప్రపంచానికి చాటాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ను డ్రగ్ మాఫియా పట్టి పీడిస్తోంది. టాలీవుడ్లో పలువురు ప్రముఖులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో విచారిస్తున్నారు. ఈ ఇష్యూపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో […]
