రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్‌

రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ […]

శ్రియ పాత్రకి అంత సీనుందా?

బాలకృష్ణ, క్రిష్‌ కాంబినేషన్‌లో రానున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా. ఇందులో బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియ ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యముందట. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పాత్ర తరహాలో చాలా పవర్‌ఫుల్‌గా శ్రియ పాత్ర ఉంటుందని సమాచారమ్‌. అయితే ఆ పవర్‌ నటనలోనేనట. ఇంతవరకూ ఇలాంటి పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో శ్రియ నటించలేదు. మరి ఇంత బరువైన పాత్రని శ్రియ ఎలా టేకప్‌ చేయగలుగుతుందో చూడాలి. […]

వైఎస్‌ జగన్‌కి మార్కులు మైనస్సే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మార్కులేశారు. సున్నా మార్కులేయడం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబుకి సున్నా మార్కులైతే వైఎస్‌ జగన్‌కి మైనస్‌ మార్కులే వస్తాయనే విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇద్దరు ఎంపీలు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీని వీడిపోయారు. ఓ రాజకీయ పార్టీకి, ఓ పార్టీ అధినాయకుడికి ఇంతకన్నా మైనస్‌ ఇంకేముంటుంది? అయినా రాజకీయాల్లో మార్కులు వేయాల్సింది ప్రజలు మాత్రమే. మేమే మార్కులేసేస్తాం […]

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జువ్వాడ నర్సింగరావులను సీఎం తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటూ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి […]

చెడ్డపనులు చేయాలన్నది మానవ నైజం – చంద్రోపదేసం

ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూక్తులు , ముక్తాయింపులతో లేనిపోని వివాదాలు కొనితేచ్చుకోవటం ఆయనకీ పరిపాటిగా మారింది.తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు సెక్రటేరియట్ ను పరిశీలించిన సీఎం ఏపీ ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అమరావతికి రావాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి వస్తాయని […]

అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]

రజినీ రోబో 2.0 సెంచరీ కొట్టాడు..

స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కనుంది అంటే.. ఆ మూవీపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 16న మెదలైన ఈ చిత్ర షూటింగ్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు శంకర్ తెలిపాడు. రెండు భారీ యాక్షన్ […]

కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]

ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే […]