బాబు జిల్లాలో ‘ఫ్యాన్స్’ పరుగులు..సీటు డౌటే!

వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మనం ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని అంటున్నారు. 175  సీట్లు ఎందుకు గెలవకూడదని అని సొంత నాయకులని ప్రశ్నిస్తున్నారు. ఇలా టార్గెట్ గా పెట్టుకున్న జగన్..ఎమ్మెల్యేలని పరుగులు తీయిస్తున్నారు. గడప గడపకు వెళ్ళాల్సిందే అని ప్రతిసారి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వర్క్ షాప్ పెట్టి గడపగడపకు వెళ్లనివారికి క్లాస్ ఇచ్చారు. అలాగే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. దీంతో […]

జగ్గంపేట వైసీపీలో కన్ఫ్యూజన్..చంటిబాబుకు ఎసరు.!

నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. సరిగ్గా పనిచేయని నాయకులకు సీటు ఇవ్వనని చెప్పేశారు..అలాగే టీడీపీ-జనసేన పొత్తు సెట్ అయితే, పొత్తు బట్టి కూడా సీట్లు మార్చే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట సీటుపై కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు..ఈయన పనితీరు అంతంత మాత్రమే. మొదట్లో ప్రజల్లో ఎక్కువ తిరగలేదు..కానీ తర్వాత […]

కరణం వారసుడి కష్టాలు..బాబు-లోకేష్‌ టార్గెట్.!

ఎన్నో ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కరణం బలరామ్ గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచాక..వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే.  తన కుమారుడు కరణం వెంకటేష్‌తో పాటు బలరామ్ వైసీపీలోకి వెళ్లారు. ఇక వైసీపీలోకి వెళ్ళాక కరణం..ఎప్పుడు కూడా చంద్రబాబుని విమర్శించిన సందర్భం లేదు. ఇటు ఏమో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లాంటి వారైతే బాబు, లోకేష్‌లని గట్టిగానే తిట్టారు. కానీ కరణం మాత్రం అలాంటి కార్యక్రమాలు చేయలేదు. తన పని తాను […]

పవన్‌ని చీపురుతో..’కొట్టు’కు తాళమే..!

ఏపీలో కులాల ఆధారంగా నాయకులని తిట్టించడంలో అధికార వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి..చంద్రబాబుని కమ్మ వర్గం నేతల చేత, పవన్ కల్యాణ్‌ని కాపు వర్గం నేతల చేత తిట్టిస్తుంటారు. ఇటీవల పవన్ మరింత దూకుడుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే తాజాగా జగనన్న కాలనీల్లో వేల కోట్లు అవినీతి జరిగిందని ఫైర్ అయ్యారు. కాలనీలు పరిశీలించి అక్కడ పరిస్తితులని చూపించారు. ఇక జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూముల సేకరణ, ఇళ్ల స్థలాలు పంచడం, […]

సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానం.!

తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏ‌ఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఎస్వీ రంగారావులు పిల్లర్లు మాదిరిగా ఉండేవారు. అలాంటి వారు వరుసగా పరమపదించారు. చివరికి కృష్ణ, కృష్ణంరాజులు ఉన్నారు..కానీ ఇప్పుడు వారు కూడా దూరమయ్యారు. కొన్ని నెలల క్రితమే కృష్ణంరాజు మరణించగా, నేడు కృష్ణ మరణించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించి, లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణ, రాజకీయ జీవితం కూడా అద్భుతంగానే ఉంటుంది. […]

మైదుకూరులో పుట్టాకు షాక్..డీఎల్ ఎంట్రీ?

ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. జగన్‌ని ఓడించడానికి పవన్‌తో కలవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ సారి అన్నీ జిల్లాల్లో మంచి ఫలితాలు రాబట్టాలనే విధంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా పైచేయి సాధించాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది..అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది..దాదాపు సగం నియోజకవర్గాల్లో […]

గుడివాడలో రావి దూకుడు..టీడీపీలోకి వలసలు..!

చాలా రోజుల తర్వాత గుడివాడలో టీడీపీకి కాస్త ఊపు కనిపిస్తోంది.. వరుసగా గెలిచి సత్తా చాటుతున్న కొడాలి నానికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదనే విధంగా గుడివాడలో రాజకీయం నడుస్తూ వచ్చింది. పైగా అధికారంలో ఉండటం, మంత్రిగా ఉండటం వల్ల గుడివాడలో కొడాలిని ఆపడం కష్టమనే పరిస్తితి. కానీ గత కొన్ని రోజుల నుంచి గుడివాడలో టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. మొదట ఇక్కడ సీటు విషయంలో ఇబ్బందులు వచ్చాయి. రావికి […]

జనసేనలోకి మాజీ మంత్రి భర్త..ఎంపీగా పోటీ?

ఏపీ రాజకీయ సమీకరణాలు ఊహించని స్థాయిలో మారుతూ ఉన్నాయి..వైసీపీకి ధీటుగా పోరాడుతున్న టీడీపీ..జనసేనతో కలిసి ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ భేటీ జరిగింది. ఆ తర్వాత మోదీతో పవన్ భేటీ, నెక్స్ట్ మోదీతో జగన్ భేటీ జరిగింది. దీంతో రాజకీయ సమీకరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా […]

గోపాలపురంలో సీన్ రివర్స్..మళ్ళీ తమ్ముళ్ళ పోరు..!

ఇంచార్జ్‌ని మారిస్తే..గోపాలాపురంలో టి‌డి‌పి బలోపేతం అవుతుందని,అందరూ కలిసికట్టుగా పంచేసి పార్టీని గెలిపిస్తారని చంద్రబాబు భావించి…యువ నేత మద్దిరాజు వెంకట్రాజుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని సైడ్ చేశారు. ఓడిపోయిన తర్వాత ముప్పిడి దూకుడుగా పనిచేస్తే, ఆయన పదవి పోయే పరిస్తితి వచ్చేది కాదు. ఆయన అనుకున్నంత యాక్టివ్ గా పనిచేయకపోవడం, అందరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం వల్ల ముప్పిడి ఇంచార్జ్ పదవి పోయింది. ఇక ఎలాగో యువ నేతలకు సీట్లు ఎక్కువ […]