టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది.
గత ఏడాది రాధేశ్యామ్ తో మొదలు.. రీసెంట్ గా విడుదలైన`కిసీ కా భాయ్ కిసీ కా జాన్` వరకు పూజ హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
ప్రస్తుతం మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్బీ 28`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మినీ డ్రెస్లో హోయలు పోతూ తన అందాలతో మంటలు రేపింది. థండర్ థైస్ తో కిర్రాక్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్ కు కుర్రకారు ఆగమాగం అయిపోతున్నారు.