వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి రకుల్ ప్రీత్ సింగ్. తన నటనతో, అందంతో తన మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. దాంతో టాలీవుడ్లో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం రకుల్కి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో రకుల్ చివరి సినిమా ‘కొండపొలం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటీ.
బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి అక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది. ఈ క్రమంలో రకుల్ ప్రీతీ సింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి. కొంతమంది ‘రకుల్ ఒక స్టార్ హీరోతో డేటింగ్లో ఉంది, అందుకే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి’ అని అంటున్నారు. మరికొంతమందేమో ‘రకుల్ బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది’ అని అంటున్నారు. ఇంకోవైపు రకుల్ డ్రగ్స్ తీసుకుంటుంది అని కామెంట్స్ చెస్తున్నారు.
ఈ కామెంట్స్ పై స్పందించిన రకుల్ మగవాళ్ల గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పింది. అయితే రకుల్ మాట్లాడుతూ ‘నాకు ఈ ఫేక్ న్యూస్ లు పట్టించుకునేంత టైమ్ లేదు ‘ అని కొట్టి పారేసింది. ఈ క్రమంలో హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అనుకునే అమ్మాయిలకు రకుల్ కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఈ సందర్బంగా రకుల్ మాట్లాడుతూ ‘ అమ్మాయిలు డబ్బు కోసం అయితే ఇండస్ట్రీలోకి అసలు రాకండి. అందంగా ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. ఒకోసారి తిండి నిద్ర మానుకోవాలి. పాత్ర ఎలాంటిది అయినా వద్దనకుండా నటించగలగాలి , అన్నిటికంటే ముఖ్యంగా మగవారి ఆధిపత్యాని తట్టుకొని నిలబడాలి. ఈ సొసైటీలో ఏం మారినా కూడా మగవారి ఆధిపత్యంలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు, ఎక్కడికి వెళ్లినా వారే గొప్ప అనేలా ప్రవర్తిస్తుంటారు. కానీ నా ఇంట్లో వాళ్ళు మాత్రం అందరూ సమానమే అనేలా పెంచారు. అందుకే స్టార్ సెలెబ్రిటీగా మంచి గుర్తింపు రావాలంటే ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురక్కొక తప్పదు’ అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.