యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్గా నటించారు. అయితే కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
దాంతో సంక్రాంతి బరిలో ఉన్న పవన్ భీమ్లా నాయక్(జనవరి 12), మహేష్ సర్కారు వారి పాట(జనవరి 13) చిత్రాలకు బిగ్ షాక్ తగిలింది. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ రాకతో ఈ చిత్రాలు వాయిదా పడనున్నాయని ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ మళ్లీ కొత్త డేట్కి షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సినిమాను విడుదల చేయాలని ఆర్ఆర్ఆర్ దర్శకనిర్మాతలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే బాక్సాఫీస్ క్లాషస్ నుంచి పవన్, మహేష్లు చాలా వరకు సేఫ్ అయినట్టే అని చెప్పాలి.