ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఇబ్బంది పడుతున్న సాధారణ సమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. కోట్లాదిమందిలో దీర్ఘకాలిక వ్యాధిలా ఉంటున్నాయి. ఈ మధుమేహం ఒకప్పుడు కేవలం వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు యేజ్తో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలోనూ ఈ మధుమేహం వ్యాధి ఉంటుంది. అయితే మధుమేహ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఎంత కంట్రోల్ చేసిన షుగర్ బ్యాలెన్స్ కాని వారికి.. ఇది ఓ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇంతకీ అదేంటో.. దానిని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. చక్కెర స్థాయాలను అదుపు చేయడానికి వంటింట్లో దొరికే ఎన్నో ఆహారాలు బాగా సహాయపడతాయి.
వాటిలో యాలుకలు కూడా ఒకటి. మధుమేహులకు యాలకులు దివ్య ఔషధం అని చెప్పాలి. ముఖ్యంగా రోజు యాలుకలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే 400 షుగర్ కూడా దెబ్బకు కంట్రోల్ అవుతుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దీనికోసం ముందుగా మూడు నుంచి నాలుగు యాలకులు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి.. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి.. ఆ వాటర్ హీట్ కాగానే దంచిన యాలుకలతో పాటు మిర్యాలను వేడి చేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన ఆ వాటర్ను ఫిల్టర్ చేసుకునే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగడంతో యాలుకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు శరీరంలోనికి చేరి రక్తంలోని చక్కెరను నియంత్రించడానికి సహకరిస్తాయి.
అదే టైంలో స్వీట్ తినాలనే ఆలోచన కూడా నశిస్తుంది. మిరియాలు కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ను కలిగి ఉంటాయి. ఈ రెండిటిని కలిపి వాటర్ మరిగించుకుని తాగడం వల్ల షుగర్ క్రమక్రమంగా కంట్రోల్ అవుతుంది. అయితే యాలుకల్లోనూ రెండు రకాలు ఉంటాయి. నలుపు మరియు ఆకుపచ్చ. నలుపు యాలకులతో పోలిస్తే గ్రీన్ వేరియంట్ ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి రెండు రకాల యాలకులు ఒకే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ మెథడ్ ప్రతిరోజు ఫాలో అయితే డయాబెటిస్ తగ్గడంలో మంచి ఫలితం లభిస్తుంది.