సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోయిన్స్ ఒక ఎత్తు ..సాయి పల్లవి మాత్రమే మరో ఎత్తు అని అంతా చెప్పుకుంటూ ఉంటారు . దానికి కారణం లేకపోనూ లేదు ..అందరి హీరోయిన్స్ లా సాయి పల్లవి డైరెక్టర్స్ వెనక పడదు ..డైరెక్టర్స్ అడిగిన సీన్స్ అన్నీ చేయదు ..డైరెక్టర్ పెట్టిన రూల్స్ అన్నిటికి ఎస్ చెప్పదు .. తాను పెట్టుకున్న రూల్సే డైరెక్టర్ లు ఎస్ చెప్పేలా ఆమె మోల్డప్ చేసుకుంటుంది.
రొమాంటిక్ ..వల్గర్ సీన్స్ లో అస్సలు నటించదు. అలాంటి కొన్ని కొన్ని నియమాలు పెట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు ఆ నియమాలలో నుంచి ఓ రూల్ బ్రేక్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి సాయి పల్లవికి డబ్బు పిచ్చి లేదు .డబ్బు మోజు అందకన్నా లేదు. అందుకే ఆమె సినిమాలు ఫ్లాప్ అయినా రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటుంది .
అయితే రీసెంట్గా ఆమె కమిట్ అయిన నాగచైతన్య చందు ముండేటి సినిమాకు మాత్రం ఆమె అక్షరాల ఐదు కోట్లు ఛార్జ్ చేసిందట . నిజానికి మేకర్స్ ఈ పాత్ర కోసం మూడు కోట్ల టార్గెట్ పెట్టుకొని ఉన్నారు . కానీ సాయి పల్లవి 5 కోట్ల డిమాండ్ చేయడం .. ఆ పాత్ర కోసం సాయి పల్లవి తప్పిస్తే మరి ఏ హీరోయిన్ సూట్ కాకపోవడంతో మేకర్స్ అలాగే సాయి పల్లవికి ఐదు కోట్లు అగ్రిమెంట్ పై రాసుకోచ్చారట . దీంతో మొదటి నుంచి డబ్బు ఆశలేదు అన్న సాయి పల్లవి కూడా డబ్బు మీద మోజు పుట్టిందని మళ్లీ హైబ్రిడ్ పిల్ల కూడా రూటు మార్చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు..!!