ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో ఇది ఓ ట్రెండ్ లా మారిపోయింది . వరుస ఫ్లాప్ సినిమాలు పడితే ప్రత్యేక పూజలు చేయించి హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు స్టార్స్. ఇప్పటికే రష్మిక మందన్నా.. నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్స్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకొని హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ అంటూ ప్రచారం జరుగుతుంది .
కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో వరుస ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది . అంతేకాదు ఆమెకు ఆఫర్లు సైతం రావడం లేదు . దీంతో కీర్తి సురేష్ కూడా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకోవాలని డిసైడ్ అయిందట . నిజానికి ఇలాంటివి కీర్తి సురేష్ పెద్దగా నమ్మదు . కానీ తన తల్లి సలహా మేరకే కీర్తి సురేష్ ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు.
కాగా రీసెంట్ గా ఆమె నటించిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా మారింది. పరమ చెత్త కలెక్షన్స్ అందుకున్నింది. ఈ సినిమా తరువాత కీర్తి తో సినిమా అంటే నే తెలుగు హీరోలు బయపడిపోతున్నారు. అందుకే కీర్తి ఇలా పూజలు చేయించుకోవడానికి డిసైడ్ అయ్యిందట..!!