టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీల బాక్సాఫీస్ వద్ద దండయాత్రకి రెడీ అవుతోంది. వచ్చే ఆరు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతోంది. ఆగస్టులో ఈ బ్యూటీ `ఆది కేశవ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతోంది.
అలాగే సెప్టెంబర్ 18న `స్కంద` రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ పోతినేని, శ్రీలీల జోడీగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రాబోతోంది. మళ్లీ నెల రోజుల తర్వాత శ్రీలీల `భగవంత్ కేసరి`తో ప్రేక్షకులను అలరించబోతోంది. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇందులో శ్రీలీల ముఖ్య పాత్రను పోషించింది.
డిసెంబర్ 23న శ్రీలీల నటించిన `ఎక్స్ ట్రా` ప్రేక్షకుల ముందు రానుంది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక జనవరిలో సంక్రాంతి పండక్కి `గుంటూరు కారం`తో సందడి చేయబోతోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల హెయిన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ కానుంది. మొత్తానికి వచ్చే ఆరు నెలలు శ్రీలీలదే హవా అని చెప్పుకోవాలి.