ఎన్టీఆర్ తన స్నేహితుడిని ఎందుకు వదిలేసారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు సైతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్నేహంగా ఉంటూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిత్రులు కూడా శత్రువు లాగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది బద్ధ శత్రువులుగా మారారు. నందమూరి తారక రామారావు ఆయన సినిమాలు వదిలేసి ప్రజా జీవితంలోకి వెళ్లి రాజకీయాలలో చాలా కీలకంగా మారి ముఖ్యమంత్రి పీఠాన్ని అతి తక్కువ సమయంలోనే అధిరోహించారు..

అయితే ఆ తర్వాత లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఎక్కడ ముఖ్యమంత్రి అవుతుందో అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ను గద్దె దింపి సీఎంగా అయ్యారు.. అప్పట్లో ఈ విషయం పెను సంచలనాలను సృష్టించింది. ఒకానొక సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాలలోకి వచ్చాక అనేకమంది స్నేహితులను పక్కన పెట్టడం జరిగింది. అలా పక్కన పెట్టిన వారిలా రచయిత చలం కూడా ఒకరు. దాదాపుగా 20 ఏళ్ల పాటు కమ్యూనిస్ట్ బావజాలంతో రచనలు రాసిన ఈయన సమాజంలో మార్పు కోసం పలు ప్రయత్నాలు చేశారు.

విలక్షణ నటునకు ప్రతిరూపం చలం..ఆఖరి రోజుల్లో విషాదంతో ముగిసిన జీవితం |  hmtvlive Special Story on Actor Chalam | KV Chalam Actor | Tollywood News
అయితే చలం నిజజీవితంలో ప్రేమలో విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఈ బాధతోనే ప్రేమ కథలు ప్రేమ ఉత్తరాలను రాస్తూ ఉండేవారని సమాచారం. చివరికి ఈయన అన్ని వదిలేసి అరుణాచలంలో రమణ మహర్షి అని ఒక ఆశ్రమంలో ఉండేవారట.. ఆ సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో ఆశ్రమం నుంచి ఎన్టీఆర్కి చాలా ఒక లేఖ రాశారు. మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి చేయాల్సింది చేశారు శేష జీవితం చాలా ప్రశాంతంగా గడుపుదామని ఆ లేఖలు రాశారట.. కానీ ఆ లేఖను మాత్రం చదవలేదని ఒక ఇంటర్వ్యూలు లక్ష్మీపార్వతి తెలిపింది. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాక అందరిని వదిలేసుకున్నారని తెలిసింది ఈమె. కేవలం రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎన్టీఆర్ ఇలా అందరిని కోల్పోవడం జరిగిందట.