తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ బిందు మాధవి కెరియర్ ప్రారంభంలో పలు సినిమాలలో నటించింది. అయితే ఈ అమ్మడు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో అడపా దడపా సినిమాలలో నటిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటి లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించింది. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి ప్రస్తుతం పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంటోంది. తాజాగా బిందు మాధవి నటించిన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనింది.
ఈ వెబ్ సిరీస్ మే 12వ తేదీన ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ లో పాల్గొన్న ఈమె తాజాగా న్యూస్ ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో బిందు మాధవి పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలను తెలియజేసింది.. ఇలాంటి సమయంలో యాంకర్ మీరు త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అందులో కొంత నిజం కొంత అబద్ధం ఉందని తెలిపింది.. త్రిష బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించిన మాట నిజమే కానీ ఒకెసారి తామిద్దరం ప్రేమించలేదని బిందు మాధవి స్పష్టం చేసింది..
త్రిష అతడికి ఎక్స్ అయ్యాకే తాము ప్రేమలో పడ్డామని తెలిపింది.. త్రిష మాజీ ప్రియుడుతో బిందు మాధవి డేటింగ్ చేసిందని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ విషయాన్ని స్వయంగా బిందు మాధవి తెలియజేయడంతో ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ నవదీప్ లీడర్లుగా చేస్తూ ఉండగా బిందు మాధవి హీరోయిన్గా నటిస్తోంది.