అల్లు అర్జన్ హీరోగా క్రేజీ దర్శకుడు సూకుమార్ తెరక్కేకించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఈ సినిమా విడుదలై ఎవరు ఉహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారి కలక్షన్లు అందుకుంది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ అంతం పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక క్రేజ్ కూడా భాగా పెరిగింది. దీంతో బాలీవుడ్లో కూడా వరుస సినిమాలో నటిస్తు బీజిగా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ఫ 2 షూటింగ్ శరవెగంగా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున రష్మికా మందన్న మత్రం ఇప్పటి వరకు షూటింగ్స్లోకి రాలేదు.
ఇది రకరకాల సందేహాలకు తావిస్తోంది. దీనిపై ఆరాలు తీస్తే అసలు విషయం బయట్టపడింది. పుష్ప-2లో రష్మికాకు అంత సీన్ లేదట. శ్రీవల్లి క్యారెక్టర్ లెంగ్త్ కూడా బాగా కట్ చేశారట. పుష్ప పార్ట్-1లో రష్మికా ఎంతో కీ రోల్ పోషించింది. పుష్పరాజ్ తో ప్రేమ, తన తండ్రిని పుష్పరాజ్ కాపాడడం, క్లైమాక్స్ లో పెళ్లి.. ఇలా రష్మిక చుట్టూ పార్ట్-1 కోనసాగింది. అయితే, ఇప్పుడు వచ్చే పార్ట్-2 లో మాత్రం శ్రీవల్లి పాత్రకు అంత స్కోప్ ఇవ్వలేదని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం.
పార్ట్-1ను బన్నీ-ఫహాద్ ఫాజిల్ కాన్ ఫ్లిక్స్ తో ముగించారు. పార్ట్-2ను కంప్లీట్ గా వీళ్లిద్దరిపైనే ఫోకస్ చేస్తూ తెరకెక్కిస్తారట. మరీ ముఖ్యంగా పోలీసాఫీసర్ ఫాజిల్ కు దొరకకుండా, బన్నీ చేసే స్మగ్లింగ్ తో పాటు.. ప్రస్తుతం తెలుగు రాష్టలో జరుగుతున రాజకీయాలకు దగ్గర ఉండే విద్దంగా సుకుమార్ కథను రేడి చేశారటా. ఆ సన్నివేశాలన్నీ బాగాం కావడంతో, రష్మికాను కేవలం సాంగ్స్ కు, మరికొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలుస్తోంది.
ఇక దీనిపై సినిమా యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు రష్మికా మాత్రం పార్ట్-2లో కూడా తనది కీలక పాత్ర అంటు చెప్పుకొస్తుంది. మరి ఈసారి తన రోల్ ఇంకాస్త ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందని కూడా చెబుతోంది. సుకుమార్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.