మరికొద్ది గంటల్లో పెళ్ళి..సిద్థార్ద్ కి ఊహించని షాకిచ్చిన కియారా..!!

మరికొద్ది గంటల్లోనే బాలీవుడ్ స్టార్ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. బాలీవుడ్లో మరోసారి గ్రాండ్ గా పెళ్లి భాజాలు మోగిపోతున్నాయి . ఇన్నాళ్లు జనాలను బాగా కన్ఫ్యూజ్ చేసిన ఈ ప్రేమ పక్షులు .. ఎట్టకేలకు ఇంట్లో ఒప్పించి .. తమ పెళ్ళిని గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిపించుకోవడానికి సిద్ధపడ్డారు. మనకు తెలిసిందే బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నా సిద్ధార్ధ్ మల్హోత్రా ..స్టార్ హీరోయిన్గా ఉన్న కీయారా అద్వాని.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే వీళ్ళ ప్రేమపై ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించిన ఈ జంట పబ్లిక్ గా మాత్రం చట్టపట్టాలేసుకొని తిరిగేస్తూ చేతిలో చేయి వేసుకుంటూ ఓవర్ రొమాన్స్ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అనఫిషియల్ గా బయట పెట్టారు. అయితే ఎట్టకేలకు ఈ ప్రేమ జంట ఒకటి కాబోతుంది. ఫిబ్రవరి 6న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని ఓ ప్యాలేస్‌లో వీరిద్ధరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరిపెళ్లిని అంగరంగా వైభవంగా జరగబోతుంది. రెండు కుటుంబాల అనుమతితో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇరుకుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసారు.

అయితే ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన కియారా తన మాజీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లికి పిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్న కీయారా మాజీ బాయ్ ఫ్రెండ్ సతి సమేతంగా అక్కడికి రావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే అతగాడికి సిద్ధార్ధ్ కి అస్సలు పడదు. ఈ విషయం బాలీవుడ్ మొత్తం తెలుసు .

అయినా కీయారా అద్వాని ఎందుకు అతగాడిని పెళ్లికి ఇన్వైట్ చేసిందా అంటూ జనాలు మండిపడుతున్నారు .. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే ఈ మిస్ అండర్స్టాండింగ్స్ ఏంటి అంటూ బాధపడుతున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఫ్రెండ్స్ గా ఉండడానికి ఇలా కీయారా అద్వానీ అతగాడిని ఇన్వైట్ చేసింది అంటూ కీయారఅభిమానులు క్లారిటీ ఇస్తున్నారు..!!