ఆ సినిమాకి మ్యూజిక్ ఇవ్వమంటే.. చెప్పకుండ పారిపోయిన కీరవాణి.. ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న కీరవాణి ..ఎన్నెన్నో మంచి సినిమాలకు సంగీతం అందించారు . మరీ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు కీరవాణి . అందుకే ఆయన సినిమాలు ఇంకా చూడబుద్ధి అవుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు . కాగా ఎన్నొ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి .. ఓ సినిమాకి మ్యూజిక్ చేయమంటే మాత్రం భయపడి పోయి వెనక్కి వెళ్ళిపోయారట. చెప్పకుండా పారిపోయారట.

క్షణక్షణం వంటి అద్భుతమైన సినిమాకు రామ్ గోపాల్ వర్మ కోసం పనిచేసిన కీరవాణి ..ఆయన డైరెక్షన్ రాత్రి అనే సినిమా కోసం కూడా మ్యూజిక్ చేయమని రిక్వెస్ట్ చేశారట . ఆ సమయానికి వర్మ నెంబర్ వన్ డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అంతే కాదు ఈ సినిమా కోసం భయపెట్టే విధంగా నగరాలతో కూడిన శబ్దాలతోఓ రేంజ్ తో సౌండ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారట . ఇదే క్రమంలో సినిమాను చూసిన తర్వాత కీరవాణి ..అసిస్టెంట్ శివ నాగేశ్వరరావు కూడా చెప్పకుండా కనిపించకుండా పారిపోయారట.

 

ఆ తర్వాత ఓ రోజు శివనాగేశ్వరరావు కీరవాణిని ఎక్కడున్నాడో ట్రెస్ చేసి పట్టుకొని మరీ మీట్ అవ్వగా ..ఆయన అసలు విషయం మాత్రం చెప్పనేలేదట. అయితే ఫైనల్లి శివ నాగేశ్వరరావు కీరవాణి అలాంటి వాడు ఎందుకు రాంగోపాల్ వర్మ సినిమాకి మ్యూజిక్ చేయట్లేదు అంటే ఏదో రీజన్ ఉంది అంటూ ..ఎంక్వైరీ చేయగా..” ఆ రాత్రి సినిమా సినిమా చూసిన తర్వాత ఆయనకి ఒకటే పీడకలు వచ్చాయని.. గుండెల్లో దడ పుట్టిందని.. ఆ కారణంగానే ఆ సినిమాకి మ్యూజిక్ ఇవ్వకూడదనుకున్నాడనే విషయం బయట పడింది”. ఈ విషయం పైకి చెప్పితే బాగోదు అని చెప్పి కీరవాణి సైలెంట్ అయిపోయాడు . ఆ తరువాత వర్మ -కీరవానిని దూరం పెట్టాడు. ఏది ఏమైనా సరే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లాంటి వాడిని భయపెట్టాడు రామ్ గోపాల్ వర్మ అంటే నిజమైన గట్స్ ఉన్న డైరెక్టర్ ఆయన అంటున్నారు సినీ జనాలు…!!