టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు 2022 సంవత్సరం మాత్రం భారీ నిరాశనే మిగిల్చింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ తెచ్చుకుందాం అనుకున్న విజయ్ ఆశలకు గండి కొట్టింది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్కు జంటగా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి భారీ నెగటివ్ టాక్ను మూట కట్టుకుంది.
ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడిప్పుడే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న ఈ రౌడీ హీరో.. ఇక తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా విజయ్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా విజయ్ షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి.
విజయ్ ఆ పోస్టులో “మనమందరం ఎంతో సంతోషంగా నవ్వినప్పుడు.. నిశ్శబ్దంగా ఏడ్చిన క్షణాలు.. అనుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడు.. కొన్ని గెలిచినప్పుడు.. కొన్ని కోల్పోయిన క్షణాలు.. ఎన్నో అనుభవాలతో గడిచిపోయింది గతేడాది. అన్నింటి సమ్మేళనమే జీవితం. ఇక ప్రతిదానిని మనం సెలబ్రెట్ చేసుకోవాల్సిందే. హ్యాపీ న్యూఇయర్ మై లవ్స్.. హావ్ ఏ గ్రేట్ న్యూ ఇయర్ ‘ అంటూ పోస్ట్ చేస్తూ.. ఓ రిసార్ట్ లో నీళ్లలో దిగి ఎంజాయ్ చేస్తున్న ఫోటో జత చేశాడు.
ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ విజయ్ తన షేర్ చేసిన ఫోటోలో గత సంవత్సరం అదే ప్లేస్ లో రష్మికా మందన్న కూడా ఫోటో దిగి షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే ప్లేస్లో ఫొటోస్ దిగటంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దింతో మరోసారి విజయ్ అడ్డంగా బుక్ అయ్యాడు.