నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ముగించుకొని సంక్రాంతి పందెం పుంజుల థియేటర్లో దూకటానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇక ఈ సినిమాను దర్శకుడు కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులను కూడా పూర్తయ్యాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు.
ఇక వీర సింహారెడ్డి ఫైనల్ రన్ టైమ్ కూడా 2గంటల 40 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ముందుగా అయితే ఈ సినిమాకు 3 గంటలకు పైగా రన్ టైమ్ అనుకోగా ఆ తర్వాత దర్శకుడు ఎడిటర్ తో చర్చించి రన్ టైం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మొత్తం గా 11ఫైట్స్ హైలెట్ గా ఉండబోతున్నాయట.. ముందుగా ఫస్ట్ ఆఫ్ లో నాలుగు ఫైట్స్ ఎవరు ఊహించని రీతిలో ఉంటాయట. మరి ముఖ్యంగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చే విధానం కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు.
ఇక మొదటి భాగంలో మూడు పాటలు కూడా హైలెట్ గా ఉంటాయట. జై బాలయ్య సాంగ్ విజువల్స్ కూడా అభిమానులతో విజిల్స్ వేయించే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక దర్శకుడు బాలకృష్ణను కూడా తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో బాలకృష్ణ కూడా అఖండను మించి మరో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకోవటం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.