కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్..లాస్ట్ మినిట్ లో నందమూరి అభిమానులకు భారీ దెబ్బేసాడుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే . ఒక స్టార్ సెలబ్రిటీ మంచి చేసినా ట్రోల్ చేస్తారు చెడు చేసిన ట్రోల్ చేస్తారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ అంటూ తేడా లేకుండా పోయింది . తమ పర్సనల్ విషయాలు కూడా వాళ్లకు తెలియక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు . మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి నిన్న కాక ఇండస్ట్రీలోకి మొన్న అడుగుపెట్టిన విశ్వక్ సేన్ వరకు అందరు పర్సనల్ మ్యాటర్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేశారు .

కాగా సోషల్ మీడియా ద్వారా కేవలం నెగిటివిటీ నే ఎక్కువ ఉందా అంటే కాదనే చెప్పాలి . కొన్ని మంచి పనులు కొంచెం పాజిటివ్ పర్సంటేజ్ కూడా ఉంది. సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుంది. తమపై వచ్చిన పుకారు వార్తలను కొట్టి పడేయడానికి కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది . అయితే కొందరు సోషల్ మీడియా ద్వారా వచ్చే ట్రోలింగ్ బాధలు తట్టుకోలేక తమ పర్సనల్ లైఫ్ ఇబ్బందులకు గురైన పర్వాలేదు అంటూ సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారు . ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ . మనకు తెలిసిందే కొరటాల శివ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవాడు .

తన పర్సనల్ అప్డేట్స్ దగ్గర నుంచి పండగలు పబ్బాలకు స్పెషల్ పోస్టులు పెడుతూ అభిమానులను ఉత్సాహపరిచేవారు . అయితే ఆచార్య సినిమా రిలీజ్ కు ముందు కొరటాల శివ ఎవ్వరూ ఊహించిన విధంగా ట్వీట్టర్ నుండి తప్పుకున్నాడు. దీనితో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ నిరసించి పోయారు . రీసెంట్ గా అదే లిస్టులో యాడ్ అయిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఎవరికి చెప్పా చేయకుండా తన ట్విట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేసేసారు. ప్రెసెంట్ ఇదే విషయం పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ అవుతుంది.

అసలు ప్రశాంత్ నీల్ ఎందుకు ఇలా చేశాడు . త్వరలోనే ప్రభాస్ తో సలార్ సినిమా ఉంది . ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేము ఎలా తెలుసుకోవాలి . ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ 31 సినిమాను తెరకెక్కించబోతున్నాడు ..ఇలాంటి క్రమంలో మాకు ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ న్యూస్లను ఎవరు అందిస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఇలా రెండు బడా బడా ప్రాజెక్ట్స్ పక్క పక్కనే ఉన్న మూమెంట్లో ప్రశాంత్ సోషల్ మీడియాకు దూరం అవడం సంచలనంగా మారింది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు..!!