రష్మిక మందన్నా సంచలన నిర్ణయం..ఇక ఒక్కోక్కడికి జానడు ఎత్తున పగిలిపోవాల్సిందే!?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే . కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మొదలైన వివాదం ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ రష్మిక మందన కెరియర్ లోనే బిగ్గెస్ట్ తప్పు చేసింది అనేది నెటిజన్స్ భావన . అంతేకాదు కాంతారా సినిమాను చూడలేదు అంటూ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో మీడియా అడగగానే ముఖం మీద ఫేస్ టు ఫేస్ చెప్పేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

ఆ కారణంగానే రిషబ్ శెట్టి రష్మిక మందన పై పగపట్టాడని ఆమెలాంటి హీరోయిన్ ఇండస్ట్రీకి ఉండకూడదు అని చెప్పి కన్నడ ఇండస్ట్రీలో ఆమెను బ్యాన్ చేసే విధంగా రెచ్చగొడుతున్నారనేది బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్న చర్చ. అయితే బాలీవుడ్లో కూదా రష్మిక మందన పై పలువురు ప్రముఖులు సీరియస్ అవుతున్నారు . ఎక్కడ నుంచో వచ్చిన రష్మిక మందన బాలీవుడ్ ను ఏ లేయడానికి రకరకాలుగా ప్లాన్స్ చేస్తుందని ..కానీ రష్మిక మందన ఫేస్ బాలీవుడ్ కి సెట్ అవ్వదని పలువురు ముఖానే చెప్పారు .

అంతేకాదు ఫిలిం క్రిటిక్స్ కె ఆర్ కే రష్మిక ను బాలీవుడ్ నుండి తరిమి కొడతాం అంటూ ఘాటుగా స్పందించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . ఈ క్రమంలోనే రష్మిక అలాంటి వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ప్రెస్ మీట్ పెట్టడానికి ట్రై చేస్తుందట. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ అయినా బాలీవుడ్ స్టార్ హీరో ఆమెను ఆపుతున్నట్లు తెలుస్తుంది . అంతే కాదు రష్మిక మందన పై స్పెషల్ కేర్ తీసుకొని తొందరపడి మాట స్లిప్ అవ్వకు అంటూ చెప్పుకొస్తున్నాడట . ఏది ఏమైనా సరే రష్మిక మందన తెగించి తాడోపేడో తేల్చుకుంటేనే ఇలాంటి ట్రోలింగ్ బాధలు తగ్గుతాయి అన్నది రష్మిక ఫ్యాన్స్ భావన .. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?