తమిళనాట నిన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడిన సంగతి తెలిసిందే. అందుకు విజయ్ దళపతి `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి కాగా.. అజిత్ కుమార్ `తునివు(తెలుగులో తెగింపు)` సినిమా మరొకటి. వరసు సినిమాకు వంశీ పడిపల్లి దర్శకత్వం వహించగా.. రష్మిక హీరోయిన్ గా నటించింది.
తునివు చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేయగా.. మంజు వారియర్ హీరోయిన్ గా చేసింది. అయితే అజిత్ సినిమా తమిళంలో పాటు తెలుగులోనే విడుదల అయింది. కానీ, విజయ్ సినిమా మాత్రం తమిళంలో మాత్రమే విడుదల అయింది. తెలుగులో జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇకపోతే తమిళనాట ఈ రెండు చిత్రాలకు మిక్డ్స్ రివ్యూలు రాగా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగా రాబట్టాయి.
అయితే తొలి రోజు తమిళంలో విజయ్ ను అజిత్ ఓడించేసేశాడు. విజయ్ సినిమా కన్నా కూడా అజిత్ కుమార్ తునివు సినిమా నే ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ రాబ్టింది. తమిళనాడులో విజయ్ వారిసుకి 20.15 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ వస్తే అజిత్ తునివు సినిమాకి 22.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక తెలుగులోనూ తొలి రోజు తెగింపు అదరగొట్టేసింది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన తెగింపు.. ఇక్కడ తొలి రోజు రూ. 1.14 కోట్ల షేర్, రూ. 2.18 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.