అవి కల్లబొల్లి కబుర్లు… తేలిగ్గా వాటిని కొట్టి పారేసిన మృణాల్ ఠాకూర్!

మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు న్యూ జెనరేషన్ కి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సీతారామం అనే సినిమా ద్వారా తెలుగులోకి అడుగిడిన మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమా మంచి ప్రేమకథ కావడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు. ముఖ్యంగా ఈమెకు తెలుగులో ఎంతోమంది అభిమానులగా మారారు. ఈ సినిమా ఆమెకి ఎంత ఉపయోగ పడింది అంటే, పలు భాషా చిత్రాలలో అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కావడం దానికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలలో పిప్పా ఒకటి. ఈ సినిమా కూడా సీతారామం మాదిరి యుద్ధ నేపథ్యంలో సాగుతుందని రిలీజ్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి. సినిమాలో ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఇషాన్ కట్టర్ కు నటి మృణాల్ చెల్లెలి పాత్రలో నటించడం కొసమెరుపు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు చెల్లెలు, భార్యల పాత్రలలో నటించడానికి మొగ్గు చూపరు. కానీ మృణాల్ అలాంటి నియమాలు ఏవి పెట్టుకోనట్టు వ్యవహరిస్తోంది.

ఇదే విషయం గురించి నటి మృణాల్ మాట్లాడుతూ… ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ అలా అనుకోవడం ఓ అపోహ మాత్రమే. ఇలాంటి పాత్రలలో నటిస్తూ రూల్స్ బ్రేక్ చేసినప్పుడే కదా మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని అంది. సినిమాలలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఇలాంటి పాత్రలను మిస్ చేసుకోకూడదని, జీవితంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుకొచ్చేది ఇలాంటి అద్భుతమైన పాత్రలే అని కూడా తెలియజేసింది. ఇక పిప్పా సినిమాలో తన పాత్ర తన మనసుని తాకిందని, అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని ఆశాభావం వ్యక్తం చేసింది.