టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి స్వయంకృషి తో ఎదిగిన హీరో అనే పేరు కలదు. ఎంతోమంది నటీనటుల సైతం చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి తన సినీ కెరీర్ మొదలుపెట్టారు. కానీ చిరంజీవి మొదట ప్రాణం ఖరీదు సినిమాతో తన మొదట చిత్రంగా విడుదల చేయడం జరిగింది.. ఖైదీ సినిమాతో చిరంజీవి సుప్రీం హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఇక తను నటించే సినిమాలు అన్నీ కూడా విభిన్నమైన మార్క్ ను చాటుకుంటూ చిరంజీవికి మెగాస్టార్ గా పేరు సంపాదించేలా చేశాయి. 150కు పైగా సినిమాలలో నటించిన చిరంజీవి తన కెరియర్లో మరుపురాని విజయాలను అందుకున్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సీనియర్ నటుడు చంద్రమోహన్ చిరంజీవి కెరియర్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రమోహన్, చిరంజీవి కెరియర్ పై మాట్లాడుతూ.. అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేరనే విషయాన్ని తెలియజేశారు. తను ఉన్నత స్థాయికి ఎదగడంలో అల్లు అరవింద్ పాత్ర చాలా ఉందని కూడా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారోజుల్లో చిరంజీవి మహాభారతంలోని అర్జునుడిగా భావించే వాళ్ళమని తెలియజేశారు. అర్జునుడు ఒక మిషన్ బయలుదేరినప్పుడు అతను ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుని వైపు చూసేవారు..అలా శ్రీకృష్ణుడు లేకుంటే భారతంలో అర్జునుడు లేడు..అలాగే అర్జునుడు చిరంజీవి, శ్రీకృష్ణుడు అల్లు అరవింద్ అని తెలియజేశారు. ఏదైనా చిత్రం అంగీకరించాలి అంటే ఏ ప్రొడక్షన్ హౌస్ తో పనిచేయాలన్నా కూడా అల్లు అరవింద్ సలహా ఇచ్చేవారట.ఇదే విషయాన్ని తాజాగా చంద్రమోహన్ తెలియజేయడం జరిగింది. చిరంజీవి అల్లు అరవింద్ సహకారం వల్లే స్టార్ గా నిలబడ్డారని తెలియజేశారు చంద్రమోహన్