లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి చాలా కాలం అయిపోయింది. ఈమె నుంచి చివరగా విరాటపర్వం, గార్గి చిత్రాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వీటి తర్వాత కొత్త సినిమాను ప్రకటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి.
డాక్టర్ చదివిన సాయి పల్లవి.. ఇక నటనకు పులిస్టాప్ పెట్టి వైద్యురాలిగా సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కోయంబత్తూర్ లో సొంతంగా హాస్పటల్ పెట్టబోతోందని కూడా వార్తలు రావడంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే తాజాగా సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. సాయి పల్లవి తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసిందట. అది కూడా ఇక్కడ కాదు.. బాలీవుడ్ లో అట.
రణ్బీర్ కపూర్, హృతిక్ రోషన్ రామ రావణులుగా మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్ కలిసి హై బడ్జెట్తో మూడు భాగాలుగా త్రీడీ రామాయణం తీయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ లేటవుతూ వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడా ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో త్రీడీ రామాయణం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఇందులో రణ్బీర్ కపూర్ కు జోడీగా సీత పాత్రలో సాయి పల్లవిను ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా కంప్లీట్ అయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఆమె ఫ్యాన్స్కు పండగే అవుతుంది.