సుడిగాలి సుధీర్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సుధీర్ జబర్దస్త్ తో పాటు అందులో వచ్చే కోన్ని షోలకు కూడా దూరమయ్యాడు. అయితే అందరూ సినిమా అవకాశాలు రావడంతో సుధీర్ వాటికి దూరమయ్యారని భావించాడు. కానీ సుధీర్ మాత్రం మాటీవీలో వస్తున్న కొన్ని టీవీ షోలకు యాంకర్ గా వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సుధీర్ మాటీవీలో వచ్చే షోలకు తన డేట్లు పూర్తి అవడంతో గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక దీంతో సుధీర్ పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సుధీర్ ఎవరు ఊహించని విధంగా సరికొత్త కామెడీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక దీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ప్రసారం చేయనుంది. అందులో వచ్చి కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షో కి సుధీర్ యాంకర్ గా వ్యవహరించున్నాడు. షోకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ షో కోసం సుధీర్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
అందులో వచ్చే ఎపిసోడ్ కి రూ.3 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఈ షోలో సుధీర్ తో పాటు జబర్దస్త్ కమిడియన్లు కూడా పాల్గొంటారట. అందులో వచ్చే కమెడియన్ రెమ్యూనికేషన్ తో పోలిస్తే సుధీర్ రెమ్యూనిరేషన్ భారీగా పెరిగింది. ఇక ఇప్పుడు సుధీర్ ఈ షో తో పాటు వరుస సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.