అబ్బబ్బా..మెగా అభిమానులు పండగ చేసుకునే న్యూస్.. ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కు ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి.

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లో ఎక్స్పెక్టేషన్ లు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు రామ్ చరణ్ కూడా తాను చేయబోయే సినిమాలను కూడా పాన్ ఇండియా ఇమేజ్‌కు తగ్గట్టు ఆచితూచి అడుగులు వేస్తూ దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇక తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్ తన తర్వాత చేసే సినిమాలపై కూడా ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాకి రామ్ చరణ్ కమిట్ అయినట్టు తెలుస్తుంది. ఆ సినిమా స్టోరీ రామ్‌చరణ్ కు నచ్చకపోవడంతో ఆ సినిమాకి నో చెప్పినట్టు తెలుస్తుంది.

Ram Charan, Buchi Babu Sana team up for a sports drama- Cinema express

ఇప్పుడు రామ్ చరణ్ చేతులో మరో ఇద్దరు దర్శకులు ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో ఒక‌రు తమిళ్ దర్శకుడు నర్తన్‌.. మ‌రోక‌రు టాలీవుడ్ లో తన మొదటి సినిమా ఉప్పెన తో సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు ఈ ఇద్దరిలో ఒకరితో రామ్ చరణ్ తన తర్వాత సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రేపు అనగా సోమవారం ఉదయం 11 గంటలకు రివిల్ చేయనున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తర్వాత సినిమాని బుచ్చిబాబుతోనే చేయబోతున్నాడని తెలుస్తుంది.