మహేష్ కంటే ముందు నమ్రత ఎంతమందితో ప్రేమాయణం నడిపించిందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది జోడిలో ఉన్న మహేష్ బాబు నమ్రతల జంట అంత పాపులర్ మరెవ్వరూ లేరు. వీరిద్దరూ ఐదేళ్లపాటు ప్రేమించుకొని ఇరుకుటుంబ సభ్యుల్ని ఒప్పించి 2005లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మహేష్ బాబు తెలుగువాడు కావడం అందులోనూ చాలా సైలెంట్ నేచర్ ఉండడంతో బయట హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ లు నడిపే అలవాటు లేదు.

కానీ ముంబై అమ్మాయి అయినా నమ్రతకు మాత్రం మహేష్ తో పెళ్లికి ముందు కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. అయితే నమ్రత మొదట్లో ఫార్మర్ మిస్ ఇండియా మోడలింగ్ చేసేది. అంతేకాకుండా మిస్ యూనివర్స్ పీజెంట్ లోకూడా పాల్గొని ఆరవ స్థానంలో నిలబడింది. ఆమె నటించిన మొదటి సినిమా `పురబ్ కి లైలా పశ్చిమ్ కి చైలా`. అయితే ఈ సినిమా నమ్రత సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాక రిలీజ్ కావడం విశేషం. ఆమె నటించిన విడుదలైన మొదటి సినిమా జ`బ్ ప్యార్ కిస్సే హోతా హై`. నమ్రత పెళ్లికి సంవత్సరం ముందు చివరాకరిగా `రోక్ సకో తో రోక్` సినిమాలో నటించింది.

ఇక అసలు విషయానికొస్తే నమ్రత మొదటి రెస్టారెంట్ ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో మునిగి తేలింది. అంతేకాకుండా రహస్యంగా వీరిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ కొన్నాళ్ళకి వీరిద్దరికీ బ్రేకప్ జరిగింది. ఆ తరువాత ఆమెకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అయినా మహేష్ మంజ్రేకర్ తో ప్రేమాయణం నడిపింది.

అయితే వీరిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం కూడా చేశారు. ఆ సమయంలోనే `వాస్తవ్` బిగ్ హిట్ అవడంతో మహేష్ మంజ్రేకర్ తో నమ్రత మరింత క్లోజ్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి తెలుగులో నటించే అవకాశం రావడం ఇక వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో మంజ్రేకర్ కి గుడ్ బై చెప్పేసి నమ్రత.. మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యపీగా సెటిలైపోయింది.